గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో సింగర్ మనో!

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో సింగర్ మనో!
x
Highlights

అయితే తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో సింగర్ మనో పాల్గొన్నారు. సంగీత దర్శకుడు కోఠి విసిరిన చాలెంజ్‌ను స్వీకరించిన మనో ఇవాళ ఉదయం ఆయన గచ్చిబౌలిలో మొక్కలు నాటారు.

టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (Green India Challenge)కి వీపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. సినీ,రాజకీయ ప్రముఖులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటుతూ మిగతా వారిని కూడా మొక్కలు నాటలని కోరుతున్నారు. ఇలా నలుమూలలా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యాప్తి చెందింది. మూడు కోట్ల మొక్కలకు ఈ ఛాలెంజ్ చేరువైంది.

అయితే తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో సింగర్ మనో పాల్గొన్నారు. సంగీత దర్శకుడు కోఠి విసిరిన చాలెంజ్‌ను స్వీకరించిన మనో ఇవాళ ఉదయం ఆయన గచ్చిబౌలిలో మొక్కలు నాటారు. అనంతరం మనో మాట్లాడుతూ..ప్రతి మనిషికి ఆయువును ఇచ్చేది పచ్చని మొక్క మాత్రమే. అలాంటి మొక్కను నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత కూడా.. ఇంత మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్న ఎంపీ సంతోష్ కుమార్‌కి కృతజ్ఞతలు అని తెలిపారు మనో.

ఇక సింగర్స్ చిత్ర, సుజాత, శ్వేతా మోహన్‌కు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు మనో. ఈ కార్యక్రమంలో సింగర్ మనోతో పాటుగా గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కో ఫౌండర్‌ రాఘవ, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, చక్రధర్ రెడ్డి పాల్గొన్నారు. అటు సింగర్ గా పాటలు పాడుతూనే జబర్దస్త్ లాంటి షోలకి జడ్జీగా కొనసాగుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories