మేము విడాకులు తీసుకుంటున్నాం : శ్వేతా బసు ప్రసాద్

మేము విడాకులు తీసుకుంటున్నాం : శ్వేతా బసు ప్రసాద్
x
swetha basu prasad (file photo)
Highlights

సినిమా తారలు ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం, విడిపోవడం అనేది కామన్ గా జరిగేదే.. ఇదేమీ కొత్తది కాదు. అలా అని వింతేమి

సినిమా తారలు ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం, విడిపోవడం అనేది కామన్ గా జరిగేదే.. ఇదేమీ కొత్తది కాదు. అలా అని వింతేమి కాదు. తాజాగా మంచు మనోజ్ దంపతులు, అంతకు ముందు కే.రాఘవేంద్రరావు కొడుకు కే.ప్రకాష్ లు తమ వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు ఆ లిస్టు లోకి సినీ నటి శ్వేతా బసు ప్రసాద్ కూడా చేరిపోయింది.

కొత్త బంగారు లోకం సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయిన శ్వేతా, 'ఏకడా..' అంటూ శ్వేత చెప్పిన క్యూట్ డైలాగ్స్‌కి యుత్ పడిపోయారు. చేసిన మొదటి సినిమాతోనే మంచి హిట్టు కొట్టిన శ్వేతా మంచి నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత చేసిన సినిమాలు ప్లాప్ కావడంతో సినిమాలకి దూరంగా ఉంటూ వచ్చింది. ఈ క్రమంలోనే ప్రముఖ వ్యాపారవేత్త అయిన రోహిత్ మిట్టల్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. చాలా రోజులుగా డేటింగ్ లో ఉన్న వీరిద్దరూ 2018 డిసెంబర్ 13న పెళ్లి చేసుకున్నారు.

వివాహం అయి సరిగ్గా సంవత్సరానికి మూడు రోజులు ఉంది అన్నగా మేమిద్దరం పరస్పరం మాట్లాడుకుని విడాకులు తీసుకున్నామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది శ్వేతా. విడాకులు తీసుకుంటున్న విషయాన్నీ తెలియజేస్తూ.. " కొన్ని నెలలుగా ఇద్దరం సమస్యలను పరిష్కరించుకోవాలని అనుకున్నాం. కానీ పరిష్కారం అవ్వలేదు. పుస్తకంలోని ప్రతీ పేజీని చదవకపోయినంత మాత్రాన ఆ పుస్తకం చెడ్డదని కాదు. కొందరు చదవలేక కొన్ని విషయాలను తెలుసుకోకుండా మిగిలిపోవచ్చు. చెరిగిపోని జ్ఞాపకాలను మిగిల్చినందుకు, నాలో స్ఫూర్తి నింపినందుకు ధన్యవాదాలు రోహిత్. నీ జీవితం గొప్పగా ఉండాలని కోరుకుంటూ నీ చీర్‌లీడర్' అంటూ పేర్కొంది. పెళ్లి అయి సంవత్సరం కాకముందే విడాకులు తీసుకోవడం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం టీవీ సీరియల్స్ లో నటిస్తుంది శ్వేతా బసు ప్రసాద్ ..



Show Full Article
Print Article
More On
Next Story
More Stories