చాలా సంతోషంగా ఉన్నాను అంటున్న శృతిహాసన్

చాలా సంతోషంగా ఉన్నాను అంటున్న శృతిహాసన్
x
Highlights

'గబ్బర్ సింగ్', 'శ్రీమంతుడు' లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించిన శృతిహాసన్ ఉన్నట్టుండి వెండితెరకు దూరమైన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే తన విదేశీ...

'గబ్బర్ సింగ్', 'శ్రీమంతుడు' లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించిన శృతిహాసన్ ఉన్నట్టుండి వెండితెరకు దూరమైన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే తన విదేశీ బోయ్ ఫ్రెండ్ మైఖేల్ కోర్సలే తో తాను పీకల్లోతు ప్రేమలో ఉన్నానని శృతి హాసన్ అధికారికంగానే ప్రకటించింది. మైఖేల్ ని తల్లి సారికకు, తండ్రి కమల్ హాసన్ కి పరిచయం చేసింది శృతి. చెన్నయ్ లో జరిగిన ఒక ఈవెంట్లలో కమల్ హాసన్ తో పాటు ఒకే వరుసలో పంచెకట్టు లో ఫోటోలకు ఫోజులిచ్చాడు మైఖేల్. ఆ తర్వాత ముంబైలో శృతి- మైఖేల్ సొంతంగా ఓ ఇల్లు కొనుక్కుని సహజీవనం మొదలుపెట్టారు అని బాలీవుడ్ మీడియా కోడై కూసింది.

తాజాగా సినిమాలను పక్కన పెట్టడానికి కారణం శృతికి సంగీతంపై ఉన్న పిచ్చి ప్రేమ అనే కొందరు అంటున్నారు. ఒక మ్యూజిక్ బ్యాండ్ ట్రూప్ తో కలిసి విదేశాల్లో లైవ్ షోలు చేయాలని శృతి నిర్ణయించుకుందని వార్తలు వచ్చాయి. తాజాగా శృతి, "కొన్ని విషయాల గురించి మనసులో ఎప్పుడూ అనుకుంటూనే ఉంటాం కానీ అవి ఎప్పటికో జరుగుతాయి. అలా చాలరోజులుగా నేను మనసులో అనుకున్న ఓ విషయం ఇప్పుడు నిజమైంది" అంటూ సోషల్ మీడియాలో తెలిపింది. "మానసికంగా నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇంత అందమైన జీవితం దక్కడం భగవంతుడి దయగా భావిస్తున్నానను" అని చెప్పుకొచ్చింది శృతి.

Show Full Article
Print Article
Next Story
More Stories