Chiranjeevi: మెగాస్టార్ తో శ్రియ మాస్ మసాలా స్టెప్పులు..

Shriya Saran Mass Masala Steps With Chiranjeevi
x

Chiranjeevi: మెగాస్టార్ తో శ్రియ మాస్ మసాలా స్టెప్పులు

Highlights

Chiranjeevi: భోళాశంకర్ మూవీ షూటింగ్ లో శ్రియశరన్ జాయిన్ తాజాగా జాయిన్ అయ్యారు.

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో 20 ఏళ్ల గ్యాప్ తర్వాత హీరోయిన్ శ్రియ శరన్ ఆడిపాడనుంది. ఔను, వీళ్లిద్దరి కాంబినేషన్ లో 20 ఏళ్ల క్రితం ఠాగూర్ సినిమా వచ్చింది. ఈ సినిమాలో పాటలు ఒక రేంజ్ లో హిట్టయ్యాయి. ఈ పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. ఠాగూర్ సినిమా తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు చిరంజీవితో కలిసి శ్రియ స్పెషల్ సాంగ్ చేస్తోంది.

వాల్తేరు వీరయ్య బంపర్ హిట్టవ్వడంతో మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ప్రస్తుతం ఆయన దర్శకుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్నారు. ఇందులో మెగాస్టార్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తుంటే...చిరంజీవి చెల్లెల్లుగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీని ఆగస్ట్ 11న రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

భోళాశంకర్ మూవీ షూటింగ్ లో శ్రియశరన్ తాజాగా జాయిన్ అయ్యారు. ఔను, స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకున్న తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఇంట్రెస్టింగ్ రోల్స్ చేస్తూ శ్రియ సీనియర్ హీరోయిన్లకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇటీవలే కన్నడ పాన్ ఇండియా మూవీ కబ్జాలో నటించిన శ్రియ ప్రస్తుతం మ్యూజిల్ స్కూల్ లో నటిస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో దుమ్ముదులుపుతున్న శ్రియ..భోళాశంకర్ మూవీలో స్పెషల్ నంబర్ చేస్తున్నారు. ఈ సాంగ్ మెగా ఫ్యాన్స్ కు..మాస్ అభిమానులకు స్పెషల్ ట్రీట్ గా ఉంటుందట. ఊర మాస్ గా ఉండే ఈ సాంగ్ సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేయడం ఖాయమని మేకర్స్ గ్యారెంటీ ఇస్తున్నారు.

తమిళ చిత్రం వేదాళంకు రీమేక్ గా దర్శకుడు మెహర్ రమేష్ భోళా శంకర్ ను ..పక్కా మాస్ అండ్ కమర్షియల్ అంశాలతో నింపేస్తున్నారు. చిరంజీవి-శ్రియ డాన్స్ ను మరోసారి తెరపై చూసేందుకు మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories