సాహో సినిమాకి ఉహించని టీఆర్పీ!

సాహో సినిమాకి ఉహించని టీఆర్పీ!
x
Highlights

గత ఏడాది సాహో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాని యువీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించింది.

గత ఏడాది సాహో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాని యువీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించింది. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం కావడం, దీనికి తోడు సినిమా బడ్జెట్ కూడా భారీగానే ఉండడంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది . ఇక సినిమా విడుదలయ్యాక సినిమాపై కొందరు బాగుంది అంటే మరికొందరు బాలేదు అన్నారు . మొత్తానికి సినిమా మిక్సు డ్ టాక్ వచ్చినా.. సినిమా మంచి కలెక్షన్లను రాబట్టింది.

అయితే ఈ చిత్రాన్ని ఇటివల జీ తెలుగులో ప్రసారం చేశారు. వెండితెర పైన సోసో అనిపించిన ఈ సినిమా బుల్లితెర ఆదరగొడుతుందని ప్రభాస్ ఫ్యాన్స్ అనుకున్నారు.. అయితే, ఎవ్వరు ఉహించానంతగా కేవలం 5.8 టీఆర్పీని సొంతం చేసుకుంది ఈ సినిమా.. ఇక ఈ సినిమా ప్రసారం అయిన రోజే మరో ఛానల్ లో కార్తికేయ గుణ 369 సినిమా వచ్చింది. ఈ సినిమాకి 5.9 టీఆర్పీ రావడం విశేషం.. మొత్తానికి సాహోకి వచ్చిన టీఆర్పీచూసి ప్రభాస్ ఫ్యాన్స్ షాక్ కి గురవుతున్నారు.

ఇక ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్‌ అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాని గోపికృష్ణ మూవీస్ , యువీ క్రియేషన్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తుండగా, జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో ప్రభాస్ సరసన పూజా హేగ్దే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన మోషన్ పోస్టర్స్, ఫస్ట్ లుక్స్ బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్, ఓం రౌత్ దర్శకులతో సినిమాలు చేయనున్నారు ప్రభాస్..

Show Full Article
Print Article
Next Story
More Stories