Jathi Ratnalu: 'జాతిరత్నాలు' సీక్వెల్‌కి అంతా సిద్ధం

Sequel for Jathi Ratnalu Is All Set To Start | Naveen Polishetty | Nag Ashwin
x

జాతి రత్నాలు (ఫొటో ట్విట్టర్)

Highlights

Jathi Ratnalu: "జాతి రత్నాలు" ఈ ఏడాదిలో విడుదలైన సినిమాలలో భారీ బ్లాక్ బస్టర్ కొట్టింది.

Jathi Ratnalu: "జాతి రత్నాలు" ఈ ఏడాదిలో విడుదలైన సినిమాలలో భారీ బ్లాక్ బస్టర్ కొట్టింది. బాక్సాఫీస్ వద్ద ఫుల్ కలెక్షన్‌లతో నిర్మాతలకు లాభాలు చేకూర్చింది. అయితే తాజా సమాచారం మేరకు నిర్మాత నాగ్ అశ్విన్, దర్శకుడు అనుదీప్ కేవీ ఈ భారీ హిట్ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేశారంట. ఈమేరకు వారిరువురు ఈ వార్తను కన్‌ఫాం కూడా చేశారు.

"జాతి రత్నాలు -2" పేరుతో రానున్న ఈ రెండవ భాగం యూఎస్ లో ఉంటుందంట. ఈ సీక్వెల్‌లో నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిలు మరోసారి సందడి చేయనున్నారు. ఊహించని పరిస్థితుల మధ్య ఈ త్రయం యూఎస్ లో ఎదుర్కొనే ఇబ్బందులే కామోడీని పంచనున్నట్లు తెలుస్తోంది.

ఓ హత్య కేసులో ఇరుక్కొని, తరువాత నిరపరాదులుగా బయటకు వస్తారు. ఆ తరువాత తమ సొంత ఊరికి చేరుకుని జీవిస్తుంటారు. సీక్వెల్ లో వీరు యూఎస్‌కి ఎందుకు వెళ్లారనేది ఆసక్తికంగా ఉండనుందని టాక్ వినిపిస్తోంది.

అయితే ఈ సినిమా మొదటి భాగానికి కొనసాగింపుగా ఉంటుందా? లేదా అనేది ప్రస్తుతానికైతే తెలియదు. ఈ సినిమాపై అంచనాలు మాత్రం భారీగానే ఉంటాయనేది వాస్తవం. మొదటి భాగం 40 కోట్ల వసూళ్లను సాధించి ఔరా అనిపించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories