తెలుగు అమ్మాయిని హీరోయిన్ చేసిన శేఖర్ కమ్ముల

తెలుగు అమ్మాయిని హీరోయిన్ చేసిన శేఖర్ కమ్ముల
x
Highlights

ఈ మధ్యనే వరుణ్ తేజ్, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన 'ఫిదా' సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. ఇక తదుపరి సినిమా ఎలా...

ఈ మధ్యనే వరుణ్ తేజ్, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన 'ఫిదా' సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. ఇక తదుపరి సినిమా ఎలా ఉండబోతోంది అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఇప్పటిదాకా శేఖర్ కమ్ముల తన అన్ని సినిమాల్లోనూ పరభాషా హీరోయిన్ల నే ఎంపిక చేసుకున్నాడు కానీ ఈ సారి మాత్రం రూటు మార్చిన శేఖర్ కమ్ముల ఒక తెలుగు అమ్మాయి ని తీసుకున్నాడు. అందరూ డెబ్యూ ఆక్టర్స్ తో శేఖర్ కమ్ముల ఈ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఒక తెలుగు అమ్మాయి హీరోయిన్ గా ఎంపికయింది.

ఆమె పేరు డింపుల్ హయతి. మిస్ దివా అనే టైటిల్ ను గెలుచుకున్న ఈమె సోషల్ మీడియా కి, మోడల్ ప్రపంచానికి సుపరిచితురాలే. నిజానికి ఇది తన మొదటి సినిమా కాదు. ఇప్పటికే సునీల్ కుమార్ రెడ్డి 'గల్ఫ్' లో నటించింది కానీ ఈ చిత్రంలో ఆమె పాత్రకు మంచి గుర్తింపు రాలేదు. అంతేకాక ఈమె తమన్నా, ప్రభుదేవా కలిసి నటించిన 'దేవి 2' చిత్రంలో కూడా ముఖ్యపాత్ర పోషించింది కానీ హీరోయిన్ తమన్నా కాబట్టి ఈమె పాత్ర అంత ప్రభావం చూపించలేకపోయింది. కనీసం ఈసారైనా ఒక మంచి హిట్ అందుకోవాలని ఈమె ప్రయత్నిస్తోంది. అన్నట్టు తెలుగమ్మాయి కదా తెలుగు చక్కగా మాట్లాడుతుండట.

Show Full Article
Print Article
Next Story
More Stories