ఆరోజు సమంత అరగంట పాటు ఏడుస్తూనే ఉందట

ఆరోజు సమంత అరగంట పాటు ఏడుస్తూనే ఉందట
x
Highlights

పెళ్ళైన తరువాత సమంత, నాగ చైతన్య కలిసి నటించిన మొదటి చిత్రంగా ఏప్రిల్ 5న విడుదలైన 'మజిలీ' చిత్రంకు ప్రేక్షకుల నుండిపాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. మంచి...

పెళ్ళైన తరువాత సమంత, నాగ చైతన్య కలిసి నటించిన మొదటి చిత్రంగా ఏప్రిల్ 5న విడుదలైన 'మజిలీ' చిత్రంకు ప్రేక్షకుల నుండిపాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. మంచి ఓపెనింగ్స్ ను రాబట్టిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. చైతూ కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ ను సాధించింది 'మజిలీ'. ఈ సందర్భంగా థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేసింది చిత్ర బృందం. ఈ వేడుక లో సమంత మాట్లాడుతూ "విడుదల రోజు తెల్లవారు జామున 2.30 గంటలకే నిద్రలేచాను. పాజిటివ్ టాక్ వచ్చిందని నిర్మాతల ద్వారా తెలుసుకున్న తర్వాత అర్థ గంట పాటు నాకు కనీళ్లు వస్తూనే ఉన్నాయి." అని చెప్పింది సమంత.

అంతే కాక తన మామయ్య నాగార్జున ఇంటికి వచ్చి మరీ అభినందించారని, అది తను ఎప్పటికి మర్చి పోలేనని, చైతూకు భార్యను అయినందుకు చాలా గర్వపడుతున్నాను అని చెప్పుకొచ్చింది. నాగచైతన్య మాట్లాడుతూ, తనకు, దర్శకుడు మధ్య చాలా అండస్ట్రాండింగ్ ఉందని అన్నారు. "మళ్లీ మళ్లీ శివతో సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. సినిమా చూసిన అందరూ తమకి శ్రావణి లాంటి భార్య కావాలని అంటున్నారు నాకు అలాంటి భార్య దొరికింది. నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా మజిలీ నాకు చాలా ప్రత్యేకమైన సినిమా" అని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories