మహేష్ అందానికి పడిపోయా : సాయి పల్లవి

మహేష్ అందానికి పడిపోయా : సాయి పల్లవి
x
Highlights

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి మహేష్ బాబు గురించి కొన్ని కామెంట్స్ చేసింది. మహేశ్‌ బాబు చాలా అందంగా ఉంటారు. ఏ సమయలో ఆయన స్కిన్‌ మెరిసిపోతుంటుంది. అయిన అయన ఫొటోలు చూసి ఫిదా అవుతుంటాను.

కేవలం కథకి మాత్రమే కాకుండా పాత్రకి కూడా ప్రాధాన్యత ఇస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ లలో సాయి పల్లవి ఒకరు. ఫిదా, ఎంసీఎ, పడిపడి లేచే మనుసు సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మలయాళీ భామ. ప్రస్తుతం కన్నడ, తమిళ, తెలుగు భాషా చిత్రాల్లో బిజీ హీరోయిన్ గా స్థిరపడిపోయింది. ఇక ఇదిలా ఉంటే అందరిలాగా ఓ హీరో పైన మనుసు పారేసుకుంది సాయి పల్లవి.. ఆ హీరో ఎవరో కాదు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి మహేష్ బాబు గురించి కొన్ని కామెంట్స్ చేసింది. మహేశ్‌ బాబు చాలా అందంగా ఉంటారు. ఏ సమయలో ఆయన స్కిన్‌ మెరిసిపోతుంటుంది. అయిన అయన ఫొటోలు చూసి ఫిదా అవుతుంటాను. ఒక వ్యక్తి ఇంత పర్‌ఫెక్ట్‌గా ఎలా ఉంటాడు? అనుకుని ఆశ్చర్యానికి లోనయ్యేదాన్ని. అయన ఫోటోలను నేను జూమ్ చేసి చూస్తాను అందులోఅ ఆయన ముఖం పైన ఒక్క మచ్చ కూడా ఉండదు. అంటూ సాయి పల్లవి వెల్లడించింది.

ఇక సాయి పల్లవి సినిమాల విషయానికి వచ్చేసరికి ప్రస్తుతం నాగచైతన్య హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న లవ్ స్టొరీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అటు రానా హీరోగా వస్తున్నవిరాటపర్వం సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories