టెన్షన్ లో ఉన్న 'సాహో' బృందం

టెన్షన్ లో ఉన్న సాహో బృందం
x
Highlights

అప్పటిదాకా తెలుగు ప్రేక్షకులలో మాత్రమే పరిమితం అయిన ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ 'బాహుబలి' సినిమా తర్వాత ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. భారతదేశం...

అప్పటిదాకా తెలుగు ప్రేక్షకులలో మాత్రమే పరిమితం అయిన ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ 'బాహుబలి' సినిమా తర్వాత ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. భారతదేశం గర్వించదగ్గ సినిమా అయిన బాహుబలి లోని రెండవ పార్ట్ 'బాహుబలి ది కంక్లూజన్' విడుదలై ఇవాళ్టితో రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం అభిమానులకు కృతజ్ఞతలు చెబుతూ సోషల్ మీడియా ద్వారా ఎమోషనల్ పోస్ట్ లు షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది పక్కన పెడితే ఇప్పుడు అందరి కళ్ళు ప్రభాస్ తదుపరి సినిమా అయిన 'సాహో' పైన ఉన్న సంగతి తెలిసిందే.

సుజిత్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, మందిరా బేడి, అరుణ్ విజయ్ వంటి పాప్యులర్ నటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఆ అంచనాలే ఇప్పుడు సాహో చిత్రబృందాన్ని స్ట్రెస్ కి గురి చేస్తోందని తెలుస్తోంది. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా సినిమా ది బెస్ట్ గా ఉండాలని చిత్రబృందం చాలా శ్రమిస్తోందని తెలుస్తోంది. అంతేకాక ప్రభాస్ కూడా సినిమా ఎలా ఉండబోతోందో అని టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కాబోతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories