Saagar K Chandra: అందుకే ఆ పాటని షూట్ చేయలేదు అంటున్న సాగర్ కే చంద్ర

Sagar K Chandra Talks about Bheemla Nayak Movie Song
x

అందుకే ఆ పాటని షూట్ చేయలేదు అంటున్న సాగర్ కే చంద్ర

Highlights

Saagar K Chandra: అందుకే ఆ పాటని షూట్ చేయలేదు అంటున్న సాగర్ కే చంద్ర

Saagar K Chandra: భారీ అంచనాల మధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి లు హీరోలుగా నటించిన "భీమ్లా నాయక్" సినిమా థియేటర్లలో ఫిబ్రవరి 25, 2022 న విడుదలైంది. మొదటి రోజు నుంచి ప్రేక్షకుల నుంచి చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన "అయ్యప్పనుమ్ కోషియుమ్" సినిమాకి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిత్యామీనన్ మరియు సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే మరియు డైలాగులను అందించారు.

నిజానికి ఈ సినిమా విడుదలకు ముందు ప్రమోషన్స్లో భాగంగా ఈ సినిమా నుంచి "అంత ఇష్టం" అనే పాటను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. నిత్యామీనన్ మరియు పవన్ కళ్యాణ్ మధ్య సాగే డ్యూయెట్ ఈ పాట. విడుదలైన కాసేపట్లోనే చార్ట్ బస్టర్ గా మారిన ఈ పాట యూట్యూబ్లో 2 కోట్లకి పైగా వ్యూస్ మరియు నాలుగు లక్షలకు పైగా లైక్స్ అందుకుంది. కానీ ఈ పాట సినిమాలో లేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దీని గురించి రియాక్ట్ అయ్యారు చిత్ర డైరెక్టర్ సాగర్ కే చంద్ర. "మేము అంత ఇష్టం పాటని షూట్ చేయలేదు. అది సినిమాలో సెట్ కాదని మాకు ముందే తెలుసు" అని చెప్పుకొచ్చారు సాగర్ కే చంద్ర. మరోవైపు ఈ పాట అభిమానులలో మాత్రం మారుమ్రోగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories