కొత్త షెడ్యూల్ కోసం సిద్ధమయిన 'ఆర్ ఆర్ ఆర్' బృందం

కొత్త షెడ్యూల్ కోసం సిద్ధమయిన ఆర్ ఆర్ ఆర్ బృందం
x
Highlights

టాలీవుడ్ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఆర్ ఆర్ ఆర్' సినిమా పై ఉన్న అన్ని పుకార్లను ప్రెస్ మీట్ ద్వారా చెక్ పెట్టారు దర్శకనిర్మాతలు. ఇప్పటికే...

టాలీవుడ్ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఆర్ ఆర్ ఆర్' సినిమా పై ఉన్న అన్ని పుకార్లను ప్రెస్ మీట్ ద్వారా చెక్ పెట్టారు దర్శకనిర్మాతలు. ఇప్పటికే రాజమౌళి సినిమా తదుపరి షెడ్యూల్ పూణే లో జరుగుతుంది అని చెప్పారు. ఈ నేపథ్యంలో చిత్రబృందం ఇప్పుడు కొత్త షెడ్యూల్ కోసం పూణే వెళ్ళింది. రాజమౌళి ముందే వెళ్లిపోయారు కాని చరణ్, తారక్ లు ఇప్పుడు జాయిన్ అవ్వబోతున్నారు. కొన్ని కీలకమైన ఎపిసోడ్స్ ఈ షెడ్యూల్ ని చిత్రీకరించనున్నారు. సుమారు 45 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనుంది.

అజయ్ దేవగన్, అలియా భట్, డైజీ లు ఈ షెడ్యూల్ లో పాల్గొనే అవకాశం లేదని తెలిసింది. అలియా భట్ జూలై తరువాతే జాయిన్ అవుతుందని సమాచారం. ఇప్పటిదాకా హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీతో మరికొన్ని లొకేషన్స్ లో రెండు షెడ్యూల్స్ జరిపిన 'ఆర్ఆర్ఆర్' ఇప్పుడు పూణేతో పాటు అహ్మదాబాద్ కూడా వెళ్తుంది. ఇప్పటికే సుద్దాల అశోక్ తేజ్ రాసిన గీతం చాలా బాగా ట్వీట్ ద్వారా తెలిపారు. మిగిలిన ట్యూన్స్ కూడా త్వరగా పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. డివివి దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories