50 రాత్రుల కష్టానికి బై బై చెప్పేసిన జక్కన టీం!

50 రాత్రుల కష్టానికి బై బై చెప్పేసిన జక్కన టీం!
x
Highlights

కరోనా వలన వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ కొద్దిరోజుల క్రితం మొదలైంది. తాజాగా నేటితో ఓ భారీ షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది చిత్ర యూనిట్ . దీనికి సంబంధించిన షూటింగ్ విశేషాలను ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసింది.

ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న చిత్రం త్రిబుల్ ఆర్.. బాహుబలి లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో స్టార్ హీరోలు రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు.. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

కరోనా వలన వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ కొద్దిరోజుల క్రితం మొదలైంది. తాజాగా నేటితో ఓ భారీ షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది చిత్ర యూనిట్ . దీనికి సంబంధించిన షూటింగ్ విశేషాలను ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసింది. "దాదాపు 50 రోజుల నైట్ షూట్ పూర్తి చేశాం. ఇక చలికాలపు రాత్రులకు గుడ్ బై.. ఇక తదుపరి షెడ్యూల్ కోసం వేరే దేశాల్లోని అందమైన ప్రదేశాలకు వెళ్తాం" అని చిత్ర యూనిట్ ట్విట్టర్ లో పేర్కొంది. ఇటీవలే చలిరాత్రాల్లో వణుకుతూ షూటింగ్ చేస్తున్న దృశ్యాలను వీడియో రూపంలో ముందుకు తీసుకువచ్చారు మేకర్స్. రాజమౌళి, ఎన్టీఆర్, కెమెరామెన్ సెంథిల్ కుమార్.. ఇలా అందరూ సెట్‌లో ఏర్పాటు చేసిన హీటర్స్ దగ్గర చలి కాచుకుంటూ కనిపించారు. ఇందులో ఎన్టీఆర్ పైన కీలకమైన ఘట్టాలను తెరకెక్కించారు జక్కన్న.

ఈ సినిమాని వచ్చే ఏడాది రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్ టాప్ హీరోలు ఇద్దరు కలిసి నటిస్తుండడం, బాహుబలి లాంటి ఇండస్ట్రీ హిట్ తరవాత రాజమౌళి నుంచి సినిమా వస్తుండడంతో సినిమా పైన మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక అజయ్ దేవగన్, శ్రియ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories