దానయ్యకు షాకింగ్ ఆఫర్ ఇచ్చిన ధర్మ ప్రొడక్షన్స్

దానయ్యకు షాకింగ్ ఆఫర్ ఇచ్చిన ధర్మ ప్రొడక్షన్స్
x
Highlights

'బాహుబలి' సినిమా తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న మరొక పాన్ ఇండియన్ సినిమా తెరకెక్కనున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రంపై భారీ అంచనాలు ఉన్న సంగతి...

'బాహుబలి' సినిమా తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న మరొక పాన్ ఇండియన్ సినిమా తెరకెక్కనున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రంపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ మధ్యనే జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఈ చిత్రాన్ని 10 భారతీయ భాషల్లో విడుదల చేయనున్నామని చెప్పుకొచ్చారు దర్శక నిర్మాతలు. ఇక ఇతర భాషలను పక్కన పెడితే హిందీలో ఈ సినిమాను ఎవరు విడుదల చేయనున్నారు అనే విషయంపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం 'బాహుబలి' ని విడుదల చేసిన ధర్మ ప్రొడక్షన్స్ రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని హిందీలో విడుదల చేయనుందని తెలుస్తోంది. ఈ చిత్రం డబ్బింగ్ రైట్స్ కోసం వారు షాకింగ్ అమౌంట్ను ఆఫర్ చేస్తున్నారని తెలుస్తోంది. కానీ నిర్మాతకు మాత్రం ఇప్పుడే ఏ భాష రైట్స్ ను అమ్మే ఆలోచన లేదట. సినిమాకు మరింత హైప్ క్రియేట్ అయిన తర్వాత ఆలోచిద్దాం అనుకుంటున్నారు. డిసెంబర్ లోపు షూటింగ్ పూర్తవుతుంది. ఆ తర్వాత ఆరు నెలలు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరగనున్నాయి. ఈ ఆరు నెలల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ వ్యవహారాలు చూసుకోవాలని దానయ్య ప్లాన్.

Show Full Article
Print Article
Next Story
More Stories