ఆశలన్నీ ఆ సినిమాపైనే పెట్టుకున్న రీతూ

ఆశలన్నీ ఆ సినిమాపైనే పెట్టుకున్న రీతూ
x
Highlights

'పెళ్లి చూపులు' సినిమా బ్లాక్ బస్టర్ అయిన తరువాత విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో స్టార్ గా ఎదిగిపోయాడు కానీ ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన రీతు వర్మ కెరీర్...

'పెళ్లి చూపులు' సినిమా బ్లాక్ బస్టర్ అయిన తరువాత విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో స్టార్ గా ఎదిగిపోయాడు కానీ ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన రీతు వర్మ కెరీర్ మాత్రం నత్తనడక నడుస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తో 'ధ్రువ నక్షత్రం' సినిమాలో నటించే అవకాశం వచ్చినప్పటికీ ఆ సినిమా విడుదలకు నోచుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న స్పై థ్రిల్లర్ పైననే అన్ని ఆశలు పెట్టుకుంది. ఇవే కాక ఇంకా చాలా వరకు రీతువర్మ నటించిన సినిమాలన్నీ సెట్స్ పైనే ఉన్నాయి కానీ వాటి గురించి ఒక్క అప్డేట్ కూడా బయటకు రావడం లేదు.

తాజాగా రీతూ అతిధి పాత్ర పోషించిన 'మౌనమే ఇష్టం' సినిమా విడుదల కాబోతోంది. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ అశోక్ వర్మ దర్శకత్వంలో ఏకే మూవీస్ పతాకంపై ఆశ అశోక్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రామ్ కార్తీక్, పార్వతి అరుణ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో రీతూ వర్మ కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రం మార్చి 15 న విడుదలవుతోంది. తాజా ప్రచార కార్యక్రమంలో కనిపించిన రీతూ ఓ అద్భుతమైన రొమాంటిక్ ఎంటర్ టైనర్ తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నానని చెప్పుకొచ్చింది. అమ్మాయికి ఎలా ప్రపోజ్ చేయాలి అన్న పాయింట్ చుట్టూ ఈ సినిమా సాగుతుందట. తన పాత్రకు ఈ చిత్రంలో చాలా ప్రాధాన్యత ఉందని చెబుతోంది. కనీసం ఈసారైనా రీతూ కి మంచి హిట్ దొరుకుతుందో లేదో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories