రష్మీకాకి పెద్ద షాక్ ఇచ్చిన దర్శకుడు

రష్మీకాకి పెద్ద షాక్ ఇచ్చిన దర్శకుడు
x
Highlights

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ఇప్పుడు తెలుగులో ఒపెనింగ్ బ్యూటీ గా మారిన సంగతి తెలిసిందే. 'ఛలో' సినిమాతో అరంగేట్రం చేసి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన...

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ఇప్పుడు తెలుగులో ఒపెనింగ్ బ్యూటీ గా మారిన సంగతి తెలిసిందే. 'ఛలో' సినిమాతో అరంగేట్రం చేసి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రష్మీక మొదటి సినిమాతోనే హిట్ అందుకుంది. ఇక తన రెండో సినిమా 'గీతగోవిందం' బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా రష్మికా మందన్న మళ్లీ విజయ్ దేవరకొండతో ని కలిసి 'డియర్ కామ్రేడ్' అనే చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'గీతగోవిందం' షూటింగ్ టైం లో జరిగిన ఒక సంఘటన గురించి బయట పెట్టింది రష్మిక.

"ఒక రోజు నేను షూటింగ్ కి కొంచెం లేట్ గా వెళ్లాను. కానీ వెళ్లాక అక్కడ ఎవరు నాతో సరిగ్గా మాట్లాడలేదు. సీరియస్ గా ప్రవర్తించారు. నాకు బాగా బాధ అనిపించింది. అసలు ఏం జరుగుతుందో తెలియక ఒక మూల కూర్చొని ఏడుస్తున్నాను. అప్పుడు దర్శకుడు పరుశురాం నా దగ్గరకు వచ్చి ఇదంతా ఒక ప్రాంక్ అని, నా నాచురల్ బాధాకరమైన ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో కాప్చర్ చేయడానికి ఇలా చేశామని చెప్పారు. కానీ నేను మాత్రం చాలా షాక్ కి గురయ్యాను. దాన్నుంచి బయట పడి నార్మల్ అవడానికి కొంత సమయం పట్టింది" అని చెప్పుకొచ్చింది రష్మీక. ఇక ఈమె 'డియర్ కామ్రేడ్' చిత్రం మే 31న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories