గోవా బయలుదేరానున్న 'ఇస్మార్ట్ శంకర్'

గోవా బయలుదేరానున్న ఇస్మార్ట్ శంకర్
x
Highlights

ఈ మధ్యనే 'హలో గురూ ప్రేమ కోసమే' అనే సినిమాతో మరొక డిజాస్టర్ ను అందుకున్న ఎనర్జిటిక్ హీరో రామ్ మరియు 'మెహబూబా' సినిమాతో ప్రేక్షకులను మెప్పించలేకపోయిన...

ఈ మధ్యనే 'హలో గురూ ప్రేమ కోసమే' అనే సినిమాతో మరొక డిజాస్టర్ ను అందుకున్న ఎనర్జిటిక్ హీరో రామ్ మరియు 'మెహబూబా' సినిమాతో ప్రేక్షకులను మెప్పించలేకపోయిన పూరి జగన్నాథ్ కలిసి 'ఇస్మార్ట్ శంకర్' అనే సినిమా తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 'సవ్యసాచి' ఫేమ్ నిధి అగర్వాల్, 'నన్ను దోచుకుందువటే' ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటిదాకా హైదరాబాద్లో జరిగింది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా హైదరాబాద్ షెడ్యూల్ ఇవాల్టితో పూర్తయింది. ఇక తదుపరి షెడ్యూల్ గోవాలో త్వరలో మొదలవనుంది. పూరి, చార్మీ సంయుక్తంగా ఈ సినిమాను పూరి కనెక్ట్స్ పతాకం పై నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాలో రామ్ సరికొత్త లుక్తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా ఇంకా విడుదల అవ్వలేదు కానీ దర్శక నిర్మాతలు అప్పుడే ఈ సినిమాకు సీక్వెల్ తీసే పనిలో పడ్డారని సీక్వెల్ కు టైటిల్ 'డబుల్ స్మార్ట్' అని పెట్టారని తెలుస్తోంది. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories