రాజమౌళి రకుల్ ని పిలుస్తాడా?

రాజమౌళి రకుల్ ని పిలుస్తాడా?
x
Highlights

అగ్ర కథానాయికల్లో ఒకరైన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం మన్మధుడు రెండో భాగం చిత్రీకరణ లో బిజీ గా గడుపుతుంది. మొదటి షెడ్యూల్ షూట్ పూర్తి చేసుకున్న రకుల్...

అగ్ర కథానాయికల్లో ఒకరైన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం మన్మధుడు రెండో భాగం చిత్రీకరణ లో బిజీ గా గడుపుతుంది. మొదటి షెడ్యూల్ షూట్ పూర్తి చేసుకున్న రకుల్ తన తదుపరి బాలీవుడ్ చిత్రం దే దే ప్యార్ దే సినిమా ప్రమోషన్స్ తో బిజీ గా గడుపుతుంది. ఈ రెండు చిత్రాలే కాకుండా రకుల్ ఇంకో రెండు తమిళ చిత్రాల తో కూడా బిజీ గా గడుపుతుంది. అయితే తాజా ఫిలిం నగర్ కబుర్ల ప్రకారం రకుల్ రాజమౌళి తీస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం లో ఏదైనా పాత్ర కోసం ఎదురు చూస్తుంది అంట. ఇండస్ట్రీ టాక్ ప్రకారం రకుల్ ఒక పెద్ద సినిమా లో ఛాన్స్ కొట్టి తన కెరీర్ ని నెక్స్ట్ లెవెల్ లోకి తీసుకెళదాం అనుకుంటుంది అంట. ఇండస్ట్రీ లో చాలా మంది దగ్గర రాజమౌళి తీసే సినిమా గురించి పాజిటివ్ గా మాట్లాడుతుంది అంట.

పైగా ఈ చిత్రం లో నటిస్తున్న హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ రకుల్ తో పని చేశారు, ఇంకా మంచి రిలేషన్ ని కూడా మైంటైన్ చేస్తున్నారు. రకుల్ ఎవరితో అయినా మాట్లాడి వాళ్ళని మెప్పిస్తూ పని జరిపించుకోవడం లో దిట్ట అని ఇండస్ట్రీ లో భోగట్టా. రాజమౌళి కూడా ఇంతకు ముందు ఒకసారి రకుల్ తో పని చేద్దాం అనుకోని కుదరక ఆ ప్లాన్ విరమించుకున్నాడు అని టాక్ ఉంది. ఇప్పుడు తన తదుపరి చిత్రం లో హీరోయిన్ లెవెల్ పాత్ర కాకపోయినా ముఖ్య పాత్ర లు కొన్ని ఉన్నాయట. దానికి తనని తీసుకుంటారు అని రకుల్ ఆశపడుతోంది కానీ దానికి ఇంకా టైం పెట్టె అవకాశం ఉంది. ప్రస్తుతం చిత్ర వర్గాలు మూడు వారాలు విరామం లో ఉన్నారు. త్వరలో ని సినిమా షూట్ తిరిగి ప్రారంభం కానున్నది.

Show Full Article
Print Article
Next Story
More Stories