ఆచార్య, రాధేశ్యాం,పుష్ప ముగ్గురికీ ఛాలెంజ్ చేసిన రాజమౌళి ఆర్ఆర్ఆర్!

ఆచార్య, రాధేశ్యాం,పుష్ప ముగ్గురికీ ఛాలెంజ్ చేసిన రాజమౌళి ఆర్ఆర్ఆర్!
x
Highlights

ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ మొక్కలు నాటమని ఆచార్య, రాధేశ్యాం, పుష్ప మూవీ యూనిట్స్ కి ఛాలెంజ్ విసిరింది.

పర్యావరణాన్ని కాపాడటానికి తామూ ఒక అడుగు ముందుకు వేసి 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' తొ మొక్కలు నాటుతున్నారు టాలీవుడ్ నటీనటులు. ఇప్పుడు ఈ ఉద్యమం మరింత ఊపందుకుంది. ఇంతవరకూ సెలబ్రిటీలు ఒకరినొకరు ఛాలెంజ్ చేసుకుంటూ మొక్కలు నాటడానికి పోటీ పడుతూ వచ్చారు. అయితే, దీనిని మరికాస్త ముందుకు తీసుకు వెళ్ళారు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా యూనిట్. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన హీరో రాం చరణ్ ఈసారి ఆ సినిమా యూనిట్ అందర్నీ ఛాలెంజ్ చేశారు. దాంతో ఆర్ఆర్ఆర్ సినిమా యూనిట్ మొక్కలు నాటింది. తరువాత వారు మెగాస్టార్ చిరంజీవి తాజా సినిమా ఆచార్య సినిమాకు, యాంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమా రాధేశ్యాం యూనిట్ కు, బన్నీ, సుకుమార్ ల పుష్ప సినిమా యూనిట్ కు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు. ఇప్పుడు ఇది కొత్త ట్రెండ్ గా మారింది.

దర్శకుడు రాజమౌళి సహా ఆర్ఆర్ఆర్ సినిమాకి చెందిన అందరూ మొక్కలు నాటారు. ఇలాగే ప్రతి సినిమా యూనిట్ మొక్కలు నాటడం ద్వారా ప్రజల్లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పట్ల అవగాహన పెంచాలనీ, భారతదేశం అంతా పచ్చదనం నిండాలనీ వారు ఈ సందర్భంగా ఆకాంక్షించారు.



Show Full Article
Print Article
Next Story
More Stories