Radhe Shyam: నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కనున్న "రాధేశ్యామ్"

Radhe Shyam Movie Coming With Based on Real Life Incidents
x

నిజ జీవిత సంఘటనల ద్వారా రాబోతున్న రాధే శ్యామ్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Radhe Shyam: ఘోస్ట్ ట్రైన్ జనెట్టి కథపై తెరకెక్కనున్న "రాధేశ్యామ్"

Radhe Shyam: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే హీరోయిన్ గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "రాధేశ్యామ్". రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ మరియు పాట ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకున్నాయి. టీజర్ చూస్తే ఈ సినిమా కథకి ట్రైన్ కి దగ్గర సంబంధం ఉందని అర్థం అవుతుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా ప్రేక్షకుల ముందుకి రాబోతోందట. ఇంతకు ముందెన్నడూ చూడని అటువంటి విధంగా టైం లైన్ కాన్సెప్టుతో ఈ సినిమా తెరకెక్కనుంది.

1911లో ఇటలీలో 106 మంది ప్యాసింజర్ లతో నడుస్తున్న జనెట్టీ అనే ఒక ట్రైన్ రోమ్ కి బయలుదేరింది. లాంబార్డ్ మౌంటెన్ వద్ద ఒక పెద్ద తన టన్నెల్ లోకి వెళ్ళిన ఈ ట్రైన్ ఇప్పటిదాకా బయటికి రాలేదు. ఆ ట్రైన్ ఏమైపోయిందో ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీనే. ఆ ట్రైన్ మరియు అందులో ఉన్న 104 మంది పాసింజర్లు ఏమైపోయారు అని ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఈ ట్రైన్ కథ ఆధారంగానే "రాధేశ్యామ్" సినిమా కథ ఉండబోతుందట. అయితే ఈ సినిమాలో ఉండే అదిరిపోయే ట్విస్ట్ అర్బన్ ఆడియెన్స్ కి మాత్రమేకాక బి, సి సెంటర్ల ప్రేక్షకులను కూడా చాలా బాగా నచ్చుతాయని అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుందని తెలుస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories