"రాధే శ్యామ్" తర్వాత అలాంటి సినిమా చేయాలనుకుంటున్న రాధాకృష్ణ

Radhe Shyam Director Radha Krishna Kumar Next Movie Update
x

"రాధే శ్యామ్" తర్వాత అలాంటి సినిమా చేయాలనుకుంటున్న రాధాకృష్ణ

Highlights

Radhe Shyam: భారీ అంచనాల మధ్య యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు స్టార్ బ్యూటీ పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న "రాధే శ్యామ్" సినిమా...

Radhe Shyam: భారీ అంచనాల మధ్య యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు స్టార్ బ్యూటీ పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న "రాధే శ్యామ్" సినిమా మార్చి 11న థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ప్యాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాధాకృష్ణ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఎప్పుడో జనవరిలో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడి మార్చిలో విడుదలకు సిద్ధమవుతోంది. డైరెక్టర్ రాధాకృష్ణ ఈ సినిమా కోసం గత ఆరేళ్లుగా పనిచేస్తున్నారు.

చిత్ర ప్రొడక్షన్ పనులు కూడా 2018 నుంచి మొదలు అయ్యాయి. కానీ ప్రభాస్ మాత్రం సాహో సినిమా విడుదలయ్యాక మాత్రమే ఈ సినిమాపై దృష్టి పెట్టారు. 2021 మధ్యలో నుంచి ప్రభాస్ తన తదుపరి సినిమాలతో బిజీ అయిపోయారు. అయితే ఈ సినిమా తర్వాత రాధాకృష్ణ ఏ సినిమా చేయబోతున్నారు అని అభిమానులు కూడా ఆసక్తిగానే ఎదురుచూస్తున్నారు. జిల్ సినిమాతో అంతగా మెప్పించలేకపోయింది "రాధే శ్యామ్" చిత్ర ట్రైలర్ లు బాగానే ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో డైరెక్టర్ రాధాకృష్ణ తన తదుపరి సినిమా కూడా ప్యాన్ ఇండియన్ రేంజ్ లో తీయాలని అనుకుంటున్నారట. ఈ నేపథ్యంలోనే కథను ప్రిపేర్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories