Pushpa Movie: పుష్ప ఈవెంట్ తో ఇబ్బందులు పడ్తున్న బృందం

Pushpa Movie Team Breaks the Government Orders by Allowing 15000 People for Pushpa Pre-Release Event
x

ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించిన "పుష్ప" బృందం

Highlights

Pushpa Movie: ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించిన "పుష్ప" బృందం

Police Complaint on Pushpa Movie Team: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న "పుష్ప" సినిమా లోని మొదటి పార్ట్ "పుష్ప: ది రైజ్" అనే టైటిల్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈచిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం నాడు తెలంగాణ పోలీస్ గ్రౌండ్స్ లో ఘనంగా జరిగింది. చాలా మంది అభిమానులు ఎక్కడెక్కడినుంచో తరలి వచ్చారు ఇప్పుడు అదే ఈ సినిమాని ఇబ్బందుల్లో పడేలా చేసింది. నిజానికి ఇలాంటి ప్రభుత్వం కరోనా కారణంగా కేవలం ఐదు వేల మంది మాత్రమే ఈవెంట్ కి హాజరయ్యే విధంగా లిమిట్ పెట్టింది.

కానీ ప్రభుత్వ ఆదేశాన్ని ధిక్కరించి మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ ఈవెంట్ కి ఏకంగా 15 వేల మందిని అలో చేశారు. దీంతో వారిపై పోలీస్ కంప్లైంట్ నమోదయింది. ఈ విషయంలో చిత్రబృందం ఇంకా రెస్పాండ్ అవ్వాల్సి ఉంది. రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా అనసూయ, సునీల్, ఫహాద్ ఫాజిల్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ట్రైలర్ తోనే మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ చిత్రం భారీ అంచనాల మధ్య 17వ తారీఖున విడుదలకు సిద్ధమవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories