సెల్ఫ్‌ ఐసోలేషన్‌లోకి సుకుమార్‌.. ఆగిపోయిన పుష్ప మూవీ?

సెల్ఫ్‌ ఐసోలేషన్‌లోకి సుకుమార్‌.. ఆగిపోయిన పుష్ప మూవీ?
x
Highlights

కరోనా వలన వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్‌ ఇటీవల తిరిగి మొదలైంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ రాజమండ్రి సమీపంలోని మారేడుమిల్లిలో జరుగుతోంది. దాదాపుగా నెల రోజుల పాటుగా షూటింగ్ ఇక్కడ జరగనుంది.

రంగస్థలం సినిమా తర్వాత పుష్ప అనే సినిమాని చేస్తున్నాడు దర్శకుడు సుకుమార్.. ఇందులో అల్లు అర్జున్ హీరోగా నటిస్తుండగా, రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇది అల్లు అర్జున్ కి 20 వ సినిమా కాగా సుకుమార్ తో మూడవ సినిమా.. గంధపు చెక్కల స్మగ్లర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుందని , ఇందులో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడని సమాచారం.

అయితే కరోనా వలన వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్‌ ఇటీవల తిరిగి మొదలైంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ రాజమండ్రి సమీపంలోని మారేడుమిల్లిలో జరుగుతోంది. దాదాపుగా నెల రోజుల పాటుగా షూటింగ్ ఇక్కడ జరగనుంది. అయితే ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ కరోనా వైరస్‌ ఎఫెక్ట్ మరోసారి ఈ సినిమా షూటింగ్‌పై పడింది. సుకుమార్‌ ప్రొడక్షన్‌ టీం సభ్యుడు ఇటీవలే చనిపోయాడు. అయితే అతనికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీనితో షూటింగ్ ని నిలిపివేసినట్టుగా తెలుస్తోంది. అటు చిత్ర యూనిట్‌లో కొందరికి కొవిడ్-19 లక్షణాలు కనిపించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక దర్శకుడు సుకుమార్ కూడా ఐసోలేషన్‌లోకి వెళ్లారని తెలుస్తోంది. కానీ దీనిపైన ఎలాంటి అధికార ప్రకటన లేదు.

ఇక సుకుమార్ , అల్లు అర్జున్ కాంబినేషన్లో ఇప్పటివరకూ వచ్చిన ఆర్య, ఆర్య 2 సినిమాలు ఎంత పెద్ద విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ రిపీట్ అవుతూ ఉండడం, బన్నీ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.



Show Full Article
Print Article
Next Story
More Stories