వంశీ పై నిప్పులు చేరుగుతున్న నిర్మాతలు

వంశీ పై నిప్పులు చేరుగుతున్న నిర్మాతలు
x
Highlights

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రంగా 'మహర్షి' సినిమా ఎట్టకేలకు భారీ అంచనాల మధ్య విడుదలైన సంగతి తెలిసిందే. సినిమా విడుదలకు ముందు మంచి...

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రంగా 'మహర్షి' సినిమా ఎట్టకేలకు భారీ అంచనాల మధ్య విడుదలైన సంగతి తెలిసిందే. సినిమా విడుదలకు ముందు మంచి హైప్ సంపాదించినప్పటికీ ఈ సినిమా కలెక్షన్ల పరంగా మాత్రం నిరాశనే మిగులుస్తోంది. సినిమా విడుదలకు ముందు ఈ సినిమా అద్భుతంగా ఉండబోతోందని, మహేష్ బాబు కెరీర్ లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా మారబోతోందని, వంశీ పైడిపల్లి స్టార్ దర్శకుడిగా మారబోతున్నాడు అని చిత్రబృందం బోలెడు కబుర్లు చెప్పింది కానీ అందులో ఒక్కటి కూడా నిజం అవ్వకపోవడం గమనార్హం.

మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రం అని తప్ప ఈ సినిమాలో మరో ఏమి ప్రత్యేకతలు లేకపోవడం అభిమానులను నిరాశ చెందేలా చేస్తోంది. ఒకవైపు ట్రేడ్ వర్గాలు ఈ సినిమా 85 కోట్ల షేర్ ను దాటేసిందని చెబుతున్నారు కానీ నిజానికి ఇంకొక పది కోట్లు వసూలు చేస్తే తప్ప బయ్యర్లు సేఫ్ జోన్ లోకి రారు. వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని ఒక క్లాసిక్ సినిమా గా మార్చ బోతున్నాడని అందరూ అనుకున్నారు కానీ విడుదలైన మొదటి రోజు నుంచే ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటోంది. మరోవైపు నిర్మాతలు కూడా వంశీ పైడిపల్లి అనవసరంగా బడ్జెట్ను తడిసి మోపెడు చేశాడంటూ మండిపడుతున్నారు అని సమాచారం అందుతోంది. అయితే మే చివరి రెండు వారాల్లో పెద్దగా విడుదల కాబోతున్న సినిమాలు ఏమీ లేవు కాబట్టి 'మహర్షి' సినిమాకి ఇంకా కొంత ఛాన్స్ ఉందని చెప్పుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories