మహేష్ కి దిల్ రాజు ఛాలెంజ్

మహేష్ కి దిల్ రాజు ఛాలెంజ్
x
Highlights

టీఆర్ యస్ నేత, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ కి రోజురోజుకి మంచి స్పందన వస్తుంది

టీఆర్ యస్ నేత, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ కి రోజురోజుకి మంచి స్పందన వస్తుంది. ప్రతి ఒక్కరు మొక్కలు నాటలని, ఆ తర్వాత మరో ముగ్గురిని మొక్కలను నాటలని కోరాలని ప్రారంభించిన ఈ కార్యక్రమం మంచి విజయవంతంగా కొనసాగుతుంది. ఇప్పటికే సుమ కనకాల, అక్కినేని అమల, రాహుల్ సిప్లిగంజ్, సూపర్ స్టార్ కృష్ణ మొక్కలను నాటి ఇదో గొప్ప కార్యక్రమని కొనియాడారు.

ఈ నేపధ్యంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇచ్చిన ఛాలెంజ్ ని స్వీకరించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని తన నివాసంలో శనివారం మనువడితో కలిసి మూడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ " నా మిత్రులు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. దీని వల్ల మన రాష్ట్రం, మన దేశం ఆకుపచ్చగా మారబోతుందని, ఇంత గొప్ప కార్యక్రమానికి పునాది వేసిన ఎంపీ సంతోష్‌కి అభినందనలు తెలిపారు. దీనిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు మొక్కలు నాటలని" అయన కోరారు.

మొక్కలు నాటిన అనంతరం దిల్ రాజు మహేష్ బాబు, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడికి ఈ ఛాలెంజ్‌ను విసిరారు. ఈ ముగ్గురితో దిల్ రాజుకి మంచి అనుబంధం ఉంది. మహేష్ తో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలని నిర్మించారు దిల్ రాజు. ఇక వంశీ పైడిపల్లిని ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం చేసింది దిల్ రాజునే.. ఇక అనిల్ రావిపూడితో వరుసగా సినిమాలు చేస్తున్నారు దిల్ రాజు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories