'చిత్రలహరి' ప్రీ రిలీజ్ బిజినెస్ జోరు అందుకోవడానికి కారణం అదేనా

చిత్రలహరి ప్రీ రిలీజ్ బిజినెస్ జోరు అందుకోవడానికి కారణం అదేనా
x
Highlights

వరుసగా రెండు మూడు ఫ్లాప్ సినిమాలు తగిలితేనే మార్కెట్ బీభత్సంగా పడిపోయిన హీరోలను చాలా మందిని చూశాం కానీ వరుసగా ఆరు డిజాస్టర్లు చవిచూసినప్పటికీ మెగా...

వరుసగా రెండు మూడు ఫ్లాప్ సినిమాలు తగిలితేనే మార్కెట్ బీభత్సంగా పడిపోయిన హీరోలను చాలా మందిని చూశాం కానీ వరుసగా ఆరు డిజాస్టర్లు చవిచూసినప్పటికీ మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తదుపరి చిత్రం అయిన 'చిత్రలహరి' మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దానికి కారణం ఈ చిత్ర టీజర్ అనే చెప్పుకోవచ్చు. కిషోర్ తిరుమల దర్శకత్వం లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా టీజర్ ఈ మధ్యనే విడుదల అయింది. కేవలం నిమిషం నిడివి గల ఈ వీడియో కు ప్రేక్షకుల నుంచి విపరీతమైన పాజిటివ్ రెస్పాన్స్ అందింది.

ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే తీరుతుందని టీజర్ చెప్పకనే చెబుతోంది. టీజర్ విడుదలైనప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జోరందుకుంది. నివేదా పేతురాజ్ మరియు కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 12న విడుదల కానుంది. అయితే డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమా కోసం ఎగబడుతున్నారని తెలుస్తోంది. ఇప్పటిదాకా సినిమాపై పెద్దగా ఆసక్తి చూపించని వారు కూడా ఇప్పుడు సినిమా రైట్ల కోసం క్యూ కడుతున్నారని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. చూస్తూ ఉంటే మెగా మేనల్లుడు ఈ సారి కచ్చితంగా హిట్ అందుకునే లాగానే ఉన్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories