డిస్ట్రిబ్యూటర్ల కోసం రెమ్యూనరేషన్ త్యాగం చేసిన ప్రభాస్

Prabhas Gave Up 50 Percent Remuneration | Telugu News Today
x

డిస్ట్రిబ్యూటర్ల కోసం రెమ్యూనరేషన్ త్యాగం చేసిన ప్రభాస్

Highlights

డిస్ట్రిబ్యూటర్ల కోసం రెమ్యూనరేషన్ త్యాగం చేసిన ప్రభాస్

Prabhas: బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ తో సినిమా చేయడానికి చిన్న నిర్మాతల నుంచి పెద్ద ప్రొడక్షన్ హౌస్ ల వరకు అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ సాహో సినిమా తో రికార్డుల వర్షం కురిపించారు. సినిమా కి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం రికార్డులు సృష్టించింది. అయితే తాజాగా ప్రభాస్ హీరోగా నటించిన సినిమా "రాధే శ్యామ్" సినిమా కూడా భారీ అంచనాల మధ్య విడుదలైంది.

పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక మిగతా రాష్ట్రాల్లో కూడా డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాన్ని కలిగించింది. అయితే "రాధేశ్యామ్" విడుదలకి ముందు ప్రభాస్ సాహో మరియు రాధేశ్యామ్ సినిమాల కోసం తాను రెమ్యునరేషన్ను తగ్గించుకొన్నట్లు చెప్పుకొచ్చారు.

నిర్మాతకి నష్టం కలిగించకుండా ప్రభాస్ ఈ పని చేసినట్లు తెలుస్తోంది. ప్రభాస్ సినిమా విడుదలకు ముందు కేవలం 50 శాతం రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకున్నారు. అయితే ఇప్పుడు రాధేశ్యామ్ సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్లు కూడా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డార్లింగ్ ప్రభాస్ తన రెమ్యూనరేషన్ నుంచి మిగతా 50 శాతాన్ని త్యాగం చేసినట్లు తెలుస్తోంది. అభిమానులు కూడా ప్రభాస్ మంచితనానికి జై జైలు కొడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories