Prabhas: ఆదిపురుష్ బృందంపై మరోసారి మండిపడుతున్న అభిమానులు

Prabhas Fans Are Trolling Om Raut
x

Prabhas: మరొకసారి ప్రభాస్ డైరెక్టర్ ని ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్

Highlights

* ఆది పురుష్ బృందంపై మరొకసారి మండిపడుతున్న అభిమానులు

Adi Purush: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న సినిమా "ఆది పురుష్". బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా జూన్ 16న థియేటర్లలో విడుదల కాబోతోంది. కానీ ఈ సినిమా విషయంలో అభిమానులు చాలా నిరాశగానే ఉన్నారు. ఈ చిత్ర టీజర్ విడుదలైనప్పటి నుంచి అభిమానులకు చిత్ర డైరెక్టర్ పై నెగిటివిటీ బాగా పెరిగిపోయింది. విజువల్ ఎఫెక్ట్స్ ఏమాత్రం బాగోలేదని సినిమా హిట్ అయ్యే అవకాశాలే కనిపించటం లేదు అని అభిమానులు డైరెక్టర్ ని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేశారు.

తాజాగా ఇప్పుడు మళ్లీ అభిమానులు ఈ చిత్ర డైరెక్టర్ ను ట్రోల్ చేయటం మొదలుపెట్టారు. కానీ ఈసారి వేరే కారణంతో ట్రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదలని మరొక రెండు నెలలు వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఎంత ప్రభాస్ సినిమా అయినప్పటికీ ప్రమోషన్లు భారీ స్థాయిలోనే ఉండాలి. నిజంగా సినిమా జూన్ 16న విడుదల అవుతుంది అంటే ప్రమోషన్లు ఇప్పటికే మొదలయ్యి ఉండాలి. కనీసం సినిమాకి సంబంధించిన పాటలో లేదా కొన్ని టీజర్లు అయినా విడుదల అవ్వాలి. కానీ చిత్ర బృందం సినిమాకి సంబంధించి ఒక్క చిన్న అప్డేట్ కూడా బయటకు రానివ్వడం లేదు.

జూన్ 16 విడుదల తేదీ పక్కా అని చెబుతున్నారు కానీ ప్రమోషన్లు మాత్రం మొదలు పెట్టలేదు. దీంతో అభిమానులు మరింత హర్ట్ అవుతున్నారు. పైగా ఈ మధ్యనే ఉగాది సందర్భంగా కూడా ఒక్క చిన్న అప్డేట్ కూడా ఇవ్వకపోవడంతో అభిమానులలో మరింత ఫ్రస్టేషన్ మొదలైంది. రామాయణం ఆధారంగా తెరకెక్కనున్న సినిమా కాబట్టి శ్రీరామనవమి సందర్భంగా కూడా సినిమాకి సంబంధించి ఒక్క అప్డేట్ కూడా బయటకు రాకపోతే అభిమానులు ఆగ్రహం తారస్థాయికి చేరుకోవచ్చు. మరి ఈసారి చిత్ర బృందం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories