సంచలన దర్శకుడితో 'ప్రభాస్' 22వ సినిమా

సంచలన దర్శకుడితో ప్రభాస్ 22వ సినిమా
x
Prabhas (File Photo)
Highlights

బాహుబలి చిత్రం ద్వారా ప్రభాస్ పాన్ ఇండియా హీరో అయ్యాడు.

బాహుబలి చిత్రం ద్వారా ప్రభాస్ పాన్ ఇండియా హీరో అయ్యాడు. ఆ సినిమాతో ప్రభాస్ కు ఇండియా వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఏర్పడింది. తరువాత యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్సకత్వంలో 'సాహో' అనే చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లో విడుదలయింది. ఈ సినిమా తోలి రోజు ఆట నుండే నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా ఓవరాల్ గా సుమారు రూ. 400 కోట్ల గ్రాస్ వసూళ్ళు సాదించింది. కేవలం బాలీవుడ్ లోనే ఈ చిత్రం సుమారు రూ. 200 కోట్ల భరీ వసూళ్లను సాధించి ప్రభాస్ స్టామినా ఏంటో నిరూపించింది.

'సాహో' తరువాత ప్రభాస్ 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది. తరువాత ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్ లో సోషియో ఫాంటసీ మూవీ చేయడానికి ఓకే చెప్పాడు. అది అలా ఉంటే ప్రభాస్ తన తర్వాత సినిమా గురించి మరో వార్త హల్ చల్ చేస్తోంది. 'కేజీఎఫ్'తో సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ప్రభాస్‌తో ఓ సినిమాకు ప్లాన్ చేస్తున్నాడని సమాచారం.



ప్రభాస్ కి ఇది 22వ చిత్రం. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్‌తో సినిమా చేసేందుకు ప్లాన్ చేసాడని సమాచారం. ఆ చిత్రం పూర్తి అయిన తరువాత ప్రభాస్ తో నీల్ చేయబోయే చిత్రం పట్టాలెక్కనుంది. ఈ సినిమాను ఆర్ఆర్ఆర్ సినిమాను నిర్మిస్తున్న డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో డీవీవీ దానయ్య నిర్మించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్, రాధాకృష్ణ, నాగ్ అశ్విన్ సినిమాలు పూర్తి అయిన తరువాత ఈ చిత్తాన్ని మొదలుపెట్టనున్నారు అని తెలుస్తుంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories