Allu Arjun: అల్లు అర్జున్ కు రామ్ గోపాల్ పేట పోలీసుల నోటీసులు

అల్లు అర్జున్ కు(Allu Arjun) రామ్ గోపాల్ పేట పోలీసులు సోమవారం నోటీసులు ఇచ్చారు.

లోడె నర్సింహ్మ
Published on: 6 Jan 2025 2:34 PM IST
Police Notice To Actor Allu Arjun
X

Allu Arjun: అల్లు అర్జున్ కు రామ్ గోపాల్ పేట పోలీసుల నోటీసులు

అల్లు అర్జున్ కు(Allu Arjun) రామ్ గోపాల్ పేట పోలీసులు సోమవారం నోటీసులు ఇచ్చారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్ ఎప్పుడు రావాలనుకున్నా తమకు సమాచారం ఇవ్వాలని ఆ నోటీసులో కోరారు. 2023 డిసెంబర్ 4న సంధ్య థియేటర్ తొక్కిసలాటలో(Sandhya Theatre Stampede) రేవతి అనే మహిళ మరణించారు. ఆమె కొడుకు శ్రీతేజ్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

శ్రీతేజ్ ను అల్లు అరవింద్ పరామర్శించారు. ఎఫ్ డీ సీ ఛైర్మన్ దిల్ రాజు (Dil Raju) పరామర్శించి ఆ కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించారు. మరో వైపు అల్లు అర్జున్ మాత్రం ఆ చిన్నారిని పరామర్శించలేదు.

ఆసుపత్రి సిబ్బంది సూచనతోనే ఆయన అక్కడికి రాలేదని అల్లు అరవింద్ గతంలో మీడియాకు తెలిపారు. డిసెంబర్ 5న అల్లు అర్జున్ శ్రీతేజ్ ను పరామర్శించేందుకు వస్తున్నారనే ప్రచారం సాగింది. శ్రీతేజ్ ను పరామర్శించేందుకు వచ్చే ముందు తమకు సమాచారం ఇవ్వాలని ఆ నోటీసులో కోరారు. ముందస్తు సమాచారం లేకుండా వస్తే ఏదైనా జరిగితే అందుకు బాధ్యత మీరే వహించాలని ఆ నోటీసులో తెలిపారు.

అల్లు అర్జున్ కు సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ ను జనవరి 3న రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. సంధ్య థియేటర్ కేసులో గతంలోనే తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టును ఆశ్రయించాలని కోర్టు ఆదేశించింది.

లోడె నర్సింహ్మ

లోడె నర్సింహ్మ

Next Story