'ఆర్ ఎక్స్ 100' బ్యూటీ తో బెల్లంకొండ

ఆర్ ఎక్స్ 100 బ్యూటీ తో బెల్లంకొండ
x
Highlights

ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుంచి సరైన హిట్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈ మధ్యనే విడుదలైన 'కవచం' సినిమా కూడా డిజాస్టర్...

ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుంచి సరైన హిట్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈ మధ్యనే విడుదలైన 'కవచం' సినిమా కూడా డిజాస్టర్ కావడంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మార్కెట్ బీభత్సంగా పడిపోయిందని చెప్పుకోవచ్చు. తాజాగా తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'సీత' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 25 వ తారీకున విడుదల కానుంది. ఇక ఈ చిత్రం తరువాత బెల్లం కొండ సాయి శ్రీనివాస్ చేతిలో మరో ఆసక్తికరమైన ప్రాజెక్టు ఉంది.

అది ఒక బయోపిక్ కావడం విశేషం. ఈ సినిమా స్టోరీ 1970లలో బాగా పాప్యులర్ అయిన స్టువర్ట్ పురం దొంగ టైగర్ నాగేశ్వర్ రావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనుందని తెలుస్తోంది. వంశీకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండబోతున్నారు. ఒకరు ఆర్ఎక్స్ 100' ఫేమ్ పాయల్ రాజ్ పుత్ కాగా మరొకరు 'సవ్యసాచి', 'మిస్టర్ మజ్ను' భామ నిధి అగర్వాల్. ఇద్దరు హీరోయిన్లు కూడా హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి వీరికి ఈ సినిమా ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories