pawan kalyan re-entry: వైసీపీ-జనసైనికుల మధ్య యుద్ధం!

pawan kalyan re-entry: వైసీపీ-జనసైనికుల మధ్య యుద్ధం!
x
Highlights

సినిమాలకు రాజకీయాలకు మధ్య గీత చెరిగిపోతోంది..కాదు..కాదు..చెరిగిపోయింది. పవర్ స్టార్ గా సినిమాల్లో తన మార్కు స్టైల్ తో అభిమానజన నీరాజనం...

సినిమాలకు రాజకీయాలకు మధ్య గీత చెరిగిపోతోంది..కాదు..కాదు..చెరిగిపోయింది. పవర్ స్టార్ గా సినిమాల్లో తన మార్కు స్టైల్ తో అభిమానజన నీరాజనం అందుకున్న పవన్ కళ్యాణ్ రాజకీయ బాట పట్టారు. 'జనసేనాని'ని అంటూ కొత్త పుంతలు తొక్కారు. అయితే..రాజకీయాల్లో సహజంగా జరిగినట్లే.. జనసేన పార్టీ ఆంద్ర ప్రదేశ్ ఎన్నికల్లో ఒక్క సీటుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రెండు చోట్ల పోటీ చేసిన పవన్ ఒక్క చోటా గెలవలేకపోయారు. రాజకీయాల్లో బిజీగా మారిన పవన్ సినిమాలకు శాశ్వతంగా బ్రేక్ ఇస్తున్నానని అప్పట్లో ప్రకటించారు. తెలుగుదేశం పార్టీతోనూ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తోనూ మొదట్నుంచీ ఆయన కాస్త స్నేహంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. చంద్రబాబుకు వైసీపీ గట్టి షాక్ ఇచ్చింది. ఇక సినిమాలు చేయకతప్పని పరిస్థితి పవన్ కు వచ్చింది. ఈ నేపధ్యంలో అయన కొత్తగా ఓ సినిమా చేస్తున్నారని బలమైన వార్తలు చాలా కాలంగా వినవస్తున్నాయి. వాటిని నిజం చేస్తూ నిన్న (జనవరి 20) పవన్ కళ్యాణ్ మళ్ళీ మేకప్ వేసుకున్న కొన్ని ఫోటోలు..వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ఫోటోల చుట్టూ జనసైనికులకు..వైసీపీ మద్దతుదార్లకూ మధ్య గట్టి యుద్ధం నడుస్తోంది.

బాలీవుడ్ లో మంచి హిట్టు అయిన 'పింక్' సినిమాని పవన్ తెలుగు రీమెక్ చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ నిన్న అన్నపూర్ణ స్టూడియోలో ఎలాంటి హడావుడి లేకుండా ప్రారంభం అయింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. షూటింగ్ స్పాట్ లో పవన్ గుబురు గడ్డంతో బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు వైరల్ గా మారాయి. అయితే ఈ వైరల్ గా మారిన ఫోటోలలో హెరిటేజ్ ప్రోడెక్ట్‌కి సంబంధించిన నేమ్ బోర్డ్ ఉంది. అయితే దీనిని ఎత్తి చూపిస్తూ కొందరు వైసీపీ శ్రేణులు పవన్ ని టార్గెట్ చేస్తూ.. ఇక్కడ కూడా నీ బాస్ హెరిటేజ్ ప్రోడెక్ట్‌ ని ప్రమోట్ చేస్తున్నావా పవన్ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో జనసైనికులు, పవన్ ఫ్యాన్స్ వారి ట్రోల్స్ ని తిప్పికొడుతున్నారు. సినిమా షూటింగ్ లో భాగంగా చాలా రకాలైన ప్రకటనలు కనిపిస్తాయి. అంతమాత్రాన వాటిని ప్రమోట్ చేసినట్టేనా అని కౌంటర్ వేస్తున్నారు. గతంలో పవన్ కి కోట్ల డబ్బులు ఇచ్చి ప్రకటనలు చేయమని వచ్చిన పవన్ వాటిని సున్నితంగా తిరస్కరించారన్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. సినిమాలు వేరు రాజకీయాలు వేరని తిప్పికొట్టారు.

ఇందులో పవన్ లాయర్ గా కనిపించనున్నాడు. పవన్ తో పాటు నివేతా థామస్, అంజలి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి లాయర్ సాబ్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఇది పవన్ కి ఇది 26 వ చిత్రం. ఈ సినిమాని దిల్ రాజు, బోనికపూర్ కలిసి నిర్మిస్తుండగా, వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాని సమ్మర్ కానుకగా మే 23న రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం పవన్ కేవలం 20 రోజుల డేట్స్ మాత్రమే ఇచ్చారని, భారీ పారితోషకం తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక ఈ సినిమాతో పాటు పవన్ క్రిష్, పూరి జగన్నాధ్ దర్శకత్వంలో కూడా సినిమాలు చేసేందుకు ప్లాన్ చేసారని తెలుస్తోంది.











Show Full Article
Print Article
More On
Next Story
More Stories