Tollywood: టాలీవుడ్‌లో పరభాష హీరోయిన్ల హవా

Tollywood: టాలీవుడ్‌లో పరభాష హీరోయిన్ల హవా
x
Highlights

Tollywood: సాయి పల్లవి, కీర్తి సురేష్‌, పూజా హెగ్డే, రష్మిక పరభాష హీరోయిన్లే * కొత్త సినిమాల్లోనూ వారే

Tollywood: పర భాష ముద్దు గుమ్మలే ప్రేక్షకులను ఆకర్షిస్తారనే నమ్మకం మన టాలీవుడ్ డైరెక్టర్ల మైండ్ సెట్. అందుకే కొత్త సినిమా స్టార్ట్ అయిందంటే చాలు.. సీనియర్ హీరో అయినా కొత్త హీరో అయినా.. పరభాష హీరోయిన్లు దిగుమతి కావాల్సిందే. మరి ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన తెలుగమ్మాయిల పరిస్థితి ఏం కావాలి?

ఫిదా సినిమాలో అచ్చమైన తెలంగాణ యాస, భాషతో అందరిని అలరించింది సాయి పల్లవి. అలాగే మహానటితో తన సత్తా చాటింది కీర్తి సురేష్‌. ఇక పూజా హెగ్డే, రష్మిక మందన్న వీళ్లంతా టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్లు. తెలుగు ఇండస్ట్రీలో వచ్చిన గుర్తింపుతో, పరభాష సినిమాల్లో కూడా అవకాశాలు తెచ్చుకుంటున్నారు.

ఉప్పెన సినిమా బ్లాక్ బస్టర్ హిట్. దాదాపు 100 కోట్ల దాకా వసూళ్లు రాబట్టింది. ఇందులో కృతిశెట్టి హీరోయిన్‌. అలాగే ఇటీవల రిలీజ్‌ అయిన జాతిరత్నాలు హీరోయిన్‌ ఫారియా అబ్దుల్లా, గాలి సంపత్‌లో నటించిన లవ్లీ సింగ్, శ్రీకారం మూవీలోని హీరోయిన్‌ ప్రియాంక అరుల్ మోహన్ వీళ్లంతా కూడా పరభాష హీరోయిన్లే.

మరి పరభాషలో సక్సెస్‌ అయిన తెలుగు అమ్మాయిలకు మాత్రం టాలీవుడ్‌లో అవకాశాలు రావడం లేదు. ప్రతిభ ఉన్నప్పటికీ వారికి తెలుగు ప్రేక్షకుల ఆదరణ దక్కడం లేదు. అందుకేనేమో.. టాలీవుడ్‌ కూడా ఎంకరేజ్‌ చేయడం లేదు. హీరోయిన్లు అంజలి, ఆనందిని, శ్రీదివ్య తదితరులు ఈ కోవకు చెందినవారే. ఎన్నో కష్టాలు పడి డైరెక్టర్‌గా అవకాశాలు తెచ్చుకుంటున్న కొత్త డైరెక్టర్లు కూడా వీళ్లను ఎంపిక చేయకపోవడం బాధాకరం.

మొత్తంగా.. తెలుగు సినిమాలు, తెలుగు హీరోలు, తెలుగు ప్రేక్షకులు.. కానీ హీరోయిన్లు మాత్రమే పరభాష వాళ్లు. ఇప్పటికైనా తెలుగువారికి అవకాశాలు రావాలని ఆశిద్దాం.

Show Full Article
Print Article
Next Story
More Stories