ఎన్టీఆర్, త్రివిక్రమ్ మీట్.. నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్

ఎన్టీఆర్, త్రివిక్రమ్ మీట్.. నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్
x
Highlights

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఓ చిత్రం రానున్నసంగతి తెలిసిందే.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఓ చిత్రం రానున్నసంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబో వచ్చే సినిమా అప్ డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా శుక్రవారం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను క‌లిసిన త్రివిక్ర‌మ్ ఇవాళ స్వ‌యంగా ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి ఆయన్నుకలవడం విశేషం. కొత్త సంవత్సరం సందర్భంగా ఎన్టీఆర్, త్రివిక్రమ్ ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకొని సరదాగా కాసేపు ముచ్చటించుకున్నారు. తమ అప్‌కమింగ్ సినిమాపై చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరి కలిసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇలా ఎన్టీఆర్- త్రివిక్రమ్ కలిసిన ఫొటోలను హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ త‌మ ట్విట్ట‌ర్‌లో షేర్ చేసింది. న్యూ ఇయర్ ఎనర్జిటిక్ డే 2 అని ట్వీట్ చేశారు. అలాగే త్వ‌ర‌లోనే ఎన్టీఆర్ 30వ చిత్రం సెట్స్ పైకి రానుందని పేర్కొంటూ నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మూవీకి 'అయిననూ పోయిరావలె హస్తినకు' అనే టైటిల్‌ అనుకుంటున్నట్లు సమాచారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, యన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఎస్. రాధాకృష్ణ, నందమూరి కళ్యాణ్‌రామ్ సంయుక్తంగా నిర్మించనున్నారు. థమన్ సంగీతం అందించనున్నారు. ఈ మూవీలో విలన్‌గా కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర నటించనున్నారని తెలుస్తోంది. చిత్రీకరణ కాకముందే ఈ సినిమా భారీ అంచనాలు నెలకొన్నాయి.

గతేడాది ఆరంభంలోనే 'అల వైకుంఠపురంలో' విజయం తన ఖాతాలో వేసుకున్నారు త్రివిక్రమ్. ఇక ఎన్టీఆర్ అయితే రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాతో బీజీగా ఉన్నారు. ఆ చిత్రం అనంతరం త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నారు. ఇవాళ ఎన్టీఆర్ త్రివిక్రమ్ భేటీపై మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలొ వీరిద్దరి కాంబోలో అరవిందసమేత వీరరాఘవ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే.



Show Full Article
Print Article
Next Story
More Stories