ఎన్టీఆర్ సరసన శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ ?

ఎన్టీఆర్ సరసన శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ ?
x
Highlights

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయ్యాయని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో కథను బట్టి మొత్తం ముగ్గురు హీరోయిన్లు ఉంటారని టాక్. ఇప్పటికే ఓ హీరోయిన్ గా రష్మిక మందన్నను ఎంపిక చేసినట్టు సమాచారం. మరో కథానాయికగా అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ ని ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. జాన్వీకపూర్ క్వాలీషిట్స్ కోసం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. మూడో కథానాయిక విషయంలో స్ఫష్టత రావలసివుంది.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపైఎస్. రాధాకృష్ణ, నందమూరి కళ్యాణ్‌రామ్ సంయుక్తంగా నిర్మించనున్నారు. థమన్ సంగీతం అందించనున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, కన్నడ నటుడు ఉపేంద్ర, మలయాళ నటుడు జయరామ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తారని తెలుస్తోంది. అరవింద సమేత తర్వాత ఎన్టీఆర్ ఇప్పుడు మళ్లీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కావడంతో చిత్రీకరణ కాకముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ సినిమాకు 'అయినను పోయిరావలె హస్తినకు' అనే ఫిక్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ నుంచి షూటింగును నిరవధికంగా నిర్వహించడానైకి ప్లాన్ చేస్తున్నారు.

గతేడాది ఆరంభంలోనే 'అల వైకుంఠపురంలో' విజయం తన ఖాతాలో వేసుకున్నారు త్రివిక్రమ్. ఇక ఎన్టీఆర్, రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాతో బీజీగా ఉన్నారు. ఆ చిత్రం అనంతరం త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నారు. ఇటీవలే ఎన్టీఆర్, త్రివిక్రమ్ సమావేశమైన సంగతి తెలిసిందే. గతంలొ వీరిద్దరి కాంబోలో అరవిందసమేత వీరరాఘవ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories