హీరోయిన్ ని తిట్టిపోస్తున్న నెటిజన్లు

హీరోయిన్ ని తిట్టిపోస్తున్న నెటిజన్లు
x
Highlights

తమిళనాడు మదురై మీనాక్షి అమ్మవారి ఆలయ పరిసరాల్లో ప్లాస్టిక్ వాడకం, మొబైల్ ఫోన్స్ వాడకం పై పూర్తిగా నిషేదం ఉంది. గత ఏడాదే మద్రాస్ హైకోర్టు ఈ నిషేధాన్ని...

తమిళనాడు మదురై మీనాక్షి అమ్మవారి ఆలయ పరిసరాల్లో ప్లాస్టిక్ వాడకం, మొబైల్ ఫోన్స్ వాడకం పై పూర్తిగా నిషేదం ఉంది. గత ఏడాదే మద్రాస్ హైకోర్టు ఈ నిషేధాన్ని అమలులోకి తీసుకువచ్చింది. గుడి నిర్వాహకులు కూడా మొబైల్ ఫోన్స్ వాడటానికి లేదు. అయితే తాజాగా ఈ విషయం తెలియని హీరోయిన్ నివేదా పేతురాజ్ మాత్రం గుడిలో స్వేచ్చగా మొబైల్ వాడటమే కాక స్నేహితురాలితో కలిసి ఫొటోలు కూడా దిగేసింది. అంతటితో ఆగకుండా ఆ తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసి మీనాక్షి అమ్మవారి దర్శించుకున్నట్లుగా చెప్పింది.

ఇక సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ లపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. సెలబ్రెటీ హోదాలో ఉండి కూడా మీనాక్షి అమ్మవారి ఆలయంలో మొబైల్స్ బ్యాన్ అనే విషయం తెలియదా అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని విమర్శలు వస్తున్నా నివేదా పేతురాజ్ మాత్రం దానిపై రియాక్ట్ అవలేదు. ప్రస్తుతం ఈమె మెగా హీరో సాయి తేజ్ హీరోగా వస్తున్న 'చిత్రలహరి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories