Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తో నిత్యమేనన్

Nithya Menen to Work With Pawan Kalyan Joins Sets From July-12
x

Pawan Kalyan...Nithya Menen

Highlights

Pawan Kalyan: తొలిసారి పవన్‌కల్యాణ్‌ - నిత్యమేనన్‌ జోడీ కట్టనున్నారు.

Pawan Kalyan:లాక్‌డౌన్‌ సడలింపు తర్వాత చిత్ర పరిశ్రమ షూటింగ్‌లతో కళకళలాడుతోంది. చిన్న హీరోల నుంచి బడా హీరోలు సెట్‌లో అడుగుపెట్టి సందడి చేస్తున్నారు. పవన్‌కళ్యాణ్ కూడా ఈ నెల రెండో వారం నుంచి తన మలయాళ రీమేక్ 'అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌' చిత్రీకరణలో పాల్గొనున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌కు జోడిగా టాలెంటెడ్ యాక్టర్ నిత్యామీనన్‌ నటిస్తోంది.

ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. తొలిసారి పవన్‌కల్యాణ్‌ - నిత్యమేనన్‌ జోడీ కట్టనున్నారు. ఇద్దరూ కలిసి ఈ నెల 12 నుంచి మొదలయ్యే చిత్రీకరణతో కెమెరా ముందుకు అడుగు పెడుతున్నారు. నిత్యా మీనన్ తెలుగులో నటించిన గుండే జారి గల్లంతయ్యిందే , మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి చిత్రాల్లో నటించి మంచి పేరును సంపాదించింది.నిత్యా మీనన్‌కు పవన్‌తో మొదటి సినిమా. దీంతో అభిమానుల్లో ఆశక్తి నెలకొంది.

ఇప్పటికే 50శాతం చిత్రీకరణ పూర్తైన ఈ సినిమాలో రానా మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఆయనకు జోడిగా ఐశ్వర్యా రాజేష్ నటిస్తున్నారు. సాగర్‌ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంభాషణలు, స్ర్కీన్‌ప్లే త్రివిక్రమ్ అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుందని తెలుస్తోంది. నిత్యమేనన్ తన సహజ నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఆమె ఇటీవల తెలుగు సినిమాల్లో నటించడం తగ్గించేసిన విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories