మూడు భాగాలుగా 'పవర్ పేట'

మూడు భాగాలుగా పవర్ పేట
x
Highlights

వరుసగా 'లై', 'చల్ మోహన్ రంగా', 'శ్రీనివాస కల్యాణం' వంటి మూడు డిజాస్టర్లు తరువాత యువ హీరో నితిన్ మార్కెట్ బాగా పడిపోయింది. అయినప్పటికీ తాజాగా ఒక భారీ...

వరుసగా 'లై', 'చల్ మోహన్ రంగా', 'శ్రీనివాస కల్యాణం' వంటి మూడు డిజాస్టర్లు తరువాత యువ హీరో నితిన్ మార్కెట్ బాగా పడిపోయింది. అయినప్పటికీ తాజాగా ఒక భారీ బడ్జెట్ సినిమాలో నటించేందుకు అవకాశం దక్కింది. ప్రస్తుతం వేణు కుడుముల దర్శకత్వంలో నితిన్ 'భీష్మ' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన తరువాత కృష్ణచైతన్య దర్శకత్వంలో మరో సినిమా భారీ బడ్జెట్తో తెరకెక్కనుండగా, ఈ చిత్రానికి 'పవర్ పేట' అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం ట్రయోలజీ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటిదాకా ఒక సినిమా రెండు భాగాలుగా విడుదలైన సందర్భాలు చాలానే చూశాం. 'బాహుబలి' నుంచి ఎన్టీఆర్ బయోపిక్ వరకు ఇలా చాలానే సినిమాలు రెండు భాగాలుగా విడుదలయ్యాయి. కానీ మొట్టమొదటిసారిగా నితిన్ సినిమా మూడు భాగాలుగా విడుదల కానుందట. ఇది ఒక రకంగా రిస్క్ అనే చెప్పుకోవాలి. నితిన్ హోమ్ బ్యానర్ సురేష్ మూవీస్ పతాకం నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు మరియు స్క్రిప్ట్ పనులు ఈ మధ్యనే పూర్తయ్యాయి. త్వరలో షూటింగ్ సెట్స్ పైకి వెళ్లబోతున్న ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories