అల్లు హీరోతో రొమాన్స్ చేయబోతున్న నిధి అగర్వాల్

అల్లు హీరోతో రొమాన్స్ చేయబోతున్న నిధి అగర్వాల్
x
Highlights

దర్శకుడు ప్రేమ్ సాయి నితిన్ హీరోగా నటించిన 'కొరియర్ బాయ్ కళ్యాణ్' అనే చిత్రంతో దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. కానీ మొదటి సినిమానే...

దర్శకుడు ప్రేమ్ సాయి నితిన్ హీరోగా నటించిన 'కొరియర్ బాయ్ కళ్యాణ్' అనే చిత్రంతో దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. కానీ మొదటి సినిమానే డిజాస్టర్ గా మారడంతో ఈ దర్శకుడికి పెద్దగా పేరు రాలేదు. తాజాగా ఈ దర్శకుడు ఇప్పుడు మెగా హీరో తో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ మధ్యనే 'ఏబిసిడి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు హీరో శిరీష్ తన తదుపరి సినిమా ప్రేమ్ సాయి దర్శకత్వంలో చేయబోతున్నాడట.

దాదాపు సంవత్సరకాలం పాటు దర్శకుడు ప్రేమ్ సాయి ఈ చిత్రం పై కసరత్తులు చేశాడని తెలుస్తోంది.ఈ సినిమాలో ఇప్పటికే హీరోయిన్ ని కూడా ఫైనలైజ్ చేశారు. 'సవ్యసాచి', 'మిస్టర్ మజ్ను' సినిమా లలో హీరోయిన్ గా నటించిన నిధి అగర్వాల్ ఈ సినిమాలో అల్లు శిరీష్ తో రొమాన్స్ చేయబోతుంది. అయితే ఈ చిత్రం కేవలం ప్రేమ్ సాయి కి మాత్రమే కాక అల్లు శిరీష్, నిధి అగర్వాల్ కి కూడా చాలా కీలకంగా మారబోతోంది. గీతా ఆర్ట్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి. మరి ఈ సినిమా ఈ ముగ్గురికి ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories