Nayanthara Surrogacy: నయనతార పెళ్లి ఆరేళ్ల క్రితమే జరిగిపోయిందా?

ఆరేళ్ల క్రితం పెళ్లి చేసేసుకున్న నయనతార మరియు విఘ్నేష్ శివన్

Arun Chilukuri
Published on: 16 Oct 2022 5:13 PM IST
Nayanthara Surrogacy Row Marriage Registered 6 Years Ago Nayanthara
X

Nayanthara Surrogacy: నయనతార పెళ్లి ఆరేళ్ల క్రితమే జరిగిపోయిందా?

Nayanthara Surrogacy: సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార మరియు ప్రముఖ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ఈ ఏడాది జూన్ 9న మహాబలిపురంలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే పెళ్లయిన నాలుగు నెలలకే నవ దంపతుల నుంచి తల్లిదండ్రులుగా మారిపోయింది ఈ జంట. ఈ నేపథ్యంలో నయనతార మరియు విగ్నేష్ సరోగసి ద్వారా తల్లిదండ్రులు అయ్యారు అని అర్థమవుతుంది. అయితే ఈ జంట సరోగేసీ నిబంధనల ప్రకారం గానే జరిగిందా లేదా అని తెలుసుకోవడానికి తమిళనాడు ప్రభుత్వం ఈ జంటకు నోటీసులు జారీ చేసింది.

వీరి సరోగసీ చట్టబద్ధమైనదా కాదా అని ముగ్గురు సభ్యులు గల ఒక కమిటీని కూడా నియమించారు తమిళనాడు ఆరోగ్య మంత్రి మా సుబ్రమణియన్. ఒక వారం రోజుల్లో వీరు ప్రభుత్వానికి నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా నయనతార మరియు విగ్నేష్ లను విచారించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సమస్య నుంచి లీగల్ గా బయటకు రావాలి అని వీరు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

నిబంధనల ప్రకారం ఏదైనా ఒక జంట వివాహం అయిన ఐదేళ్ల తరువాత మాత్రమే సరోగసీను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ చట్టం జనవరి 2022 నుంచే అమల్లోకి వచ్చింది. అయితే తాజా సమాచారం ప్రకారం నయనతార మరియు విగ్నేష్ శివన్ వివాహం ఆరేళ్ల క్రితమే జరిగిపోయింది అని ఆరోగ్య శాఖకు అఫిడవిట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆరేళ్ల క్రితమే తమ వివాహం రిజిస్టర్ అయినట్లుగా పత్రాలను కూడా సమర్పించారట. దీంతో ఆరేళ్ల క్రితమే వీరి పెళ్లి జరిగిందని అభిమానులు సైతం షాక్ కి గురి అవుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story