Jathiratnalu: ఇంట్లో కాదు థియేటర్స్‌లో చూసుకుందాం..'జాతిరత్నాలు' రిలీజ్ డేట్ ఫిక్స్

Jathiratnalu: ఇంట్లో కాదు థియేటర్స్‌లో చూసుకుందాం..జాతిరత్నాలు రిలీజ్ డేట్ ఫిక్స్
x

జాతిరత్నాలు 

Highlights

నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలు పోషింస్తూ..అనుదీప్ కేవీ దర్శకత్వం వహించిన చిత్రం ‘జాతిరత్నాలు’.

యువకథానాయకుడు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేమ్ నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలు పోషింస్తూ..అనుదీప్ కేవీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'జాతిరత్నాలు'.ఈ సినిమాకు రథన్ సంగీతం సమకూర్చారు. ఇప్పటికే విడుదలైన తొలి పాట 'చిట్టి'కి మంచి స్పందన వస్తోంది. టైటిల్‌తోనే ఈ సినిమా అందరినీ ఆకర్షించింది. 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ' లాంటి హిట్ సినిమా తరవాత నవీన్ పొలిశెట్టి నుంచి వస్తోన్న మరో కావడంతో ఆసక్తి పెంచింది.

తాజాగా సినిమా విడుదల తేదీని ప్రకటించారు. దీనికి సంబంధించి ఒక మోషన్ పోస్టర్‌ విడుదల చేశారు. అంతేకాదు, మోషన్ పోస్టర్ కాన్సెప్ట్ కూడా చాలా కొత్తగా ఉంది. మహా శివరాత్రి సందర్భంగా మార్చి 11న 'జాతిరత్నాలు' థియేటర్లలోకి రానున్నారు. ''ఇంట్లో కాదు థియేటర్స్‌లో చూసుకుందాం.. రండి నవ్వుకుందాం'' అంటూ వినూత్నంగా ప్రచారాన్ని మొదలుపెట్టారు.

ఏంది? సినిమా రిలీజు ఉన్నదా లేదా.. ఇక మీతోనే పెట్టుకుంటరా'' అంటూ 'జాతిరత్నాలు' రిలీజ్ గురించి తెలంగాణ యాసలో ఇద్దరు వ్యక్తుల మధ్య డిస్కషన్‌ను ఈ మోషన్ పోస్టర్‌లో వినిపించారు. ''షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు పెళ్లి చేసుకున్నా.. ఇప్పుడు నా కొడుకు అడుగుతాండు రిలీజ్ ఎప్పుడు అని'' అని ఓ వ్యక్తే చెప్పే డైలాగ్ ఈ మోషన్ పోస్టర్‌కే హైలైట్. మొత్తం మీద ఈ మోషన్ పోస్టర్‌తో ప్రేక్షకుల అటెన్షన్‌ను తమవైపు తిప్పుకోగలిగింది స్వప్న సినిమా.

స్వప్న సినిమా బ్యానర్‌పై నాగ్ అశ్విన్ నిర్మించారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించారు. సిద్ధం మనోహర్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి అభినవ్ రెడ్డి దండ ఎడిటర్. ఈ చిత్రంలో ఇంకా మురళీ శర్మ, వీకే నరేష్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్ తదితరులు నటించారు . వైజయంతీ మూవీస్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ నుంచి వస్తోన్న సినిమా కావడంతో అంచనాలు కూడా ఏర్పడ్డాయి.



Show Full Article
Print Article
Next Story
More Stories