పవిత్రపై చెప్పుతో దాడి చేసేందుకు ప్రయత్నించిన రమ్య

Naresh Went to Mysore With Pavitra Lokesh
x

పవిత్రపై చెప్పుతో దాడి చేసేందుకు ప్రయత్నించిన రమ్య

Highlights

Naresh: కొంత కాలంగా సన్నిహితంగా ఉంటున్న నరేష్, పవిత్ర

Naresh: టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్రా లోకేష్‌లకు మైసూరులో అనూహ్య ఘటన ఎదురైంది. వీరిద్దరూ కలిసి వెళ్తుండగా... వీరిపై నరేష్ భార్య రమ్య దాడి చేసేందుకు ప్రయత్నించింది. పవిత్రా లోకేష్‌పై చెప్పు తీసుకొని ఆమె దాడి చేసేందుకు ప్రయత్నించింది. అయితే న‌రేశ్, ప‌విత్రా లోకేశ్‌ల‌కు సెక్యూరిటీగా వ‌చ్చిన పోలీసులు ర‌మ్యను అడ్డుకున్నారు. ఈ దృశ్యాలు ఇప్పుడు వైర‌ల్‌గా మారిపోయాయి.

త‌మ‌పై దాడి చేసేందుకు య‌త్నించిన ర‌మ్య‌ను మ‌రింత‌గా ఉడికించేందుకు న‌రేశ్ యత్నించాడు. ర‌మ్య‌ను చూసి విజిల్ వేస్తూ ఆయ‌న వెళ్లిపోయాడు. అంతేకాకుండా చేయి ఊపుతూ, ర‌మ్య గురించి కామెంట్ చేస్తూ వెళ్లిపోయాడు. త‌న భ‌ర్త‌ను త‌న‌కు ద‌క్క‌కుండా ప‌విత్రా లోకేశ్ చేస్తోంద‌ని ర‌మ్య ఆరోపిస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌న‌కు విడాకులు ఇవ్వ‌కుండానే న‌రేశ్... ప‌విత్రా లోకేశ్‌ను ఎలా పెళ్లి చేసుకుంటారంటూ కూడా ర‌మ్య ప్ర‌శ్నించిన విష‌యం తెలిసిందే.

న‌రేశ్‌కు అప్ప‌టికే రెండు పెళ్లిళ్లు కాగా... ర‌మ్య ఆయ‌న‌కు మూడో భార్య‌. ర‌మ్య‌తో చాలా కాలంగా దూరంగానే ఉంటున్న న‌రేశ్... తాజాగా ప‌విత్రా లోకేశ్‌తో స‌న్నిహితంగా ఉంటున్నాడు. వీరి బంధంపై పెద్ద ఎత్తున పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో ఇటీవ‌లే స్పందించిన న‌రేశ్ త‌మ మ‌ధ్య స్నేహం మాత్ర‌మే ఉందంటూ వ్యాఖ్యానించాడు. ప‌విత్రా లోకేశ్ మాత్రం న‌రేశ్‌కు ఆత్మీయ తోడు అవ‌స‌ర‌మ‌ని, కొంత‌కాలంగా అత‌డికి మానసికంగా అండ‌గా నిలుస్తున్నాన‌ని ప్ర‌క‌టించింది. ఈ ప్ర‌క‌ట‌న‌ల నేప‌థ్యంలోనే ర‌మ్య వీరిద్ద‌రిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. ఈ క్ర‌మంలోనే వారిపై దాడికి య‌త్నించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories