Nagababu: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. చిరంజీవి, సుస్మితను గుర్తుచేసుకున్న నాగబాబు


Nagababu: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. చిరంజీవి, సుస్మితను గుర్తుచేసుకున్న నాగబాబు
Nagababu: అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం తనని కలిచివేసిందని నటుడు, ఎమ్మెల్సీ నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
Nagababu: అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం తనని కలిచివేసిందని నటుడు, ఎమ్మెల్సీ నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారికి తన ప్రగాడ సానుభూతిని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఒక పక్క విమానం ప్రమాదంలో చనిపోయిన వారు, మరో పక్క హాస్టల్పై విమానం కూలిపోవడంతో చనిపోయిన మెడికోలు... ఈ రెండూ కూడా తనని చాలా కలిచివేశాయని నాగబాబు ఎమోషనల్ అయ్యారు.
గొంతు పూడుకుపోతుందని, ఏడుపు రావడం లేదని అన్నారు. దేవుడున్నాడని నమ్మే వాళ్లు ఈ విమానంలో ఉండి ఉంటారు కదా మరి అలాంటప్పుడు దేవుడు వారిని ఎందుకు కాపాడలేకపోయారని అన్నారు. చనిపోయిన మెడికోలు ఎన్ని ఆశలతో డాక్టర్ చదువుతున్నారోనని.. వారి తల్లిదండ్రులు ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటారోనని బాధపడ్డారు. కొన్ని గంటలైతే తమ వాళ్లను చేరుకుంటాం కదా అని ఎన్నో ఆశలతో వెళుతున్న వారు ఇలా మధ్యలోనే చనిపోవడం చాలా బాధాకరం అన్నారు. ఈ శతాబ్ధానికి ఇంతకన్న పెద్ద ఆపద రాదు రాకూడదని నాగబాబు కోరుకున్నారు.
విమాన ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని... ఆ విజువల్స్ ఇంకా ఇప్పటికీ మనసులో నుండి పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతోమంది యువతీయువకులు తమ భవిష్యత్తు కోసం ఎన్నో ఆశలతో ఫ్లైట్ ఎక్కి ఉంటారు. మరికొంతమంది బంధువులను, తమ వాళ్లను కలిసేందుకు ప్రయాణమై ఉంటారు. పసిపిల్లలు తమ తల్లి దగ్గర క్షేమంగా ఉన్నామనుకున్న పసిపిల్లలు, పెద్దవాళ్లు, విమాన సిబ్బంది, ఎంతో అనుభవం ఉన్న పైలెట్లు, అసలు ఈ ఫ్లైట్తో సబంధం లేని మెడికో స్టూడెంట్స్ .. ఈ ప్రమాదంలో తమ ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం అన్నారు.
ఒకసారి విమానం ప్రమాదంలో చిక్కుకున్న తన తమ్ముడు చిరంజీవి అతని కుమార్తె సుస్మిత గురించి తలుచుకుని నాగబాబు బాధపడ్డారు. ఒకసారి ఎంతోమంది సినిమా వాళ్లున్న ఫ్లైట్లో చిరంజీవి, సుస్మిత ఉన్నారని, అకస్మాత్తుగా ఫ్లైట్ తిరుపతి పొలాల్లో ల్యాండ్ అయిందని తెలిసిందని, ఆ సమయంతో తన తమ్ముడు, సుస్మిత ఎలా ఉన్నారో అన్న ఆంధోళన చెందామని గుర్తుచేసుకున్నారు. అయితే ఆ తర్వాత విమానంలో అందరూ సేఫ్గా వచ్చినట్టు తెలుసుకుని కుదుటపడ్డానని అన్నారు.
అహమ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ నా మనస్సుని కలచి వేసింది .చాలా సంవత్సరాల క్రితం ఎంతో మంది filmy పర్సనాలిటీస్ ఉన్న చెన్నై ఫ్లైట్ తిరుపతి లో ఎక్కడో ల్యాండ్ అయ్యింది.అందులో మా అందరికీ అత్యంత ప్రియమైన మా అన్నయ్య మా స్వీటీ(సుష్మిత)పాపా ఉన్నారు .ఫ్లైట్ తిరుపతి పొలాల్లో ల్యాండ్ అయ్యిందంట మా…
— Naga Babu Konidela (@NagaBabuOffl) June 12, 2025

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



