Prabhas: బాలీవుడ్ డైరెక్టర్ తో ప్రభాస్ మూవీ?

Prabhas: బాలీవుడ్ డైరెక్టర్ తో ప్రభాస్ మూవీ?
x
Highlights

Prabhas: టాలీవుడ్‌లో ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ పేరు మారుమోగిపోతోంది.

Prabhas: టాలీవుడ్‌లో ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ పేరు మారుమోగిపోతోంది. వరుస విజయాలు ఓ వైపు, భారీ సినిమాలు మరోవైపు చేస్తూ ఫుల్ జోష్ లో ఉంది. ప్రస్తుతం చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ తదితరులతో సినిమాలు చేస్తుంది మైత్రీ మూవీ మేకర్స్.

తాజా నివేదికల మేరకు, మైత్రీ మూవీ మేకర్స చాలా కాలం క్రితం ప్రభాస్ తో సినిమా కోసం భారీగానే ప్లాన్ చేసింది. కానీ, పలు కారణాలతోప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం ప్రభాస్ తో నూతన ప్రాజెక్టు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది మైత్రీ మూవీస్. ఈ ప్రాజెక్ట్ కోసం బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తో చర్చలు జరుపుతోంది. సిద్ధార్థ్ఆనంద్.. షారుఖ్ ఖాన్ "పఠాన్" సినిమాతో బిజీగా ఉన్నాడు. అలాగే హృతిక్ రోషన్ తో "ఫైటర్" ని లైన్ లో ఉంచాడు. కాగా, ఈ బాలీవుడ్ డైరెక్టర్ తో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేస్తాం అని మైత్రీ మూవీస్ పేర్కొంది.

అయితే, ప్రభాస్ "సలార్", "ఆదిపురుష్" అలాగే నాగ్ అశ్విన్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. 2022 నాటికి ప్రభాస్, సిద్ధార్థ్ ఆనంద్ ఇద్దరూ తమ ప్రస్తుత ప్రాజెక్టలు పూర్తిచేసి ఖాళీగా ఉంటారు. దీంతో ప్రభాస్‌తో మైత్రి ప్రాజెక్ట్ 2023 లో ప్రారంభం కానుందని ప్రొడక్షన్ హౌస్ అభిప్రాయపడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories