'స‌ర్కారు వారి పాట‌'కు 'శ్రీమంతుడు' సెంటిమెంట్‌?

స‌ర్కారు వారి పాట‌కు శ్రీమంతుడు సెంటిమెంట్‌?
x
Highlights

శ్రీమంతుడు చిత్రం మైత్రి మూవీ మేకర్స్ కి మొదటి సినిమా కావడం, మొదటి సినిమానే భారీ హిట్ కావడంతో గ‌స్టు 7వ తేదీనే సర్కారు వారి పాట చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మైత్రి నిర్మాతలు.

మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు చిత్రం ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే. మైత్రీ మూవీమేక‌ర్స్ నిర్మించిన ఈ సినిమాలో మహేష్ సరసన శ్రుతిహసన్ హీరోయిన్ గా నటించింది. జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ కీలకపాత్రలు పోషించారు. మళ్ళీ కాస్తా గ్యాప్ తో ఇదే సంస్థతో సినిమాని చేస్తున్నాడు మహేష్ బాబు.

పరుశురాం దర్శకత్వంలో మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాని మైత్రి మూవీ సంస్థ నిర్మిస్తుంది. ఇటీవ‌లే గ్రాండ్ గా లాంఛ్ అయిన ఈ చిత్రం 2021 జ‌న‌వ‌రి నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుపెట్ట‌నుంది. అయితే ఈ సినిమాని షూటింగ్ ని చకచక ఫినిష్ చేసి శ్రీమంతుడు విడుద‌ల అయిన ఆగ‌స్టు 7వ తేదీనే స‌ర్కారు వారి పాట‌ను కూడా విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారట.

శ్రీమంతుడు చిత్రం మైత్రి మూవీ మేకర్స్ కి మొదటి సినిమా కావడం, మొదటి సినిమానే భారీ హిట్ కావడంతో గ‌స్టు 7వ తేదీనే సర్కారు వారి పాట చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మైత్రి నిర్మాతలు. చూడాలి మరి ఎం జరుగుతుందో. ఇక అటు ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories