టాలీవుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసు : ముంబైలో పట్టుబడిన టాలీవుడ్ హీరోయిన్ పరారీ

టాలీవుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసు : ముంబైలో పట్టుబడిన టాలీవుడ్ హీరోయిన్ పరారీ
x
Highlights

టాలీవుడ్ ఇండస్ట్రీని డ్రగ్స్ కేసు మరోసారి ఊపేస్తుంది. నిన్న ముంబైలోని మీరా రోడ్డులో ఉన్న ఓ పెద్దహోటల్‌ లో డ్రగ్స్‌ను ఎన్సీబీ అధికారులు పట్టుకున్నారు....

టాలీవుడ్ ఇండస్ట్రీని డ్రగ్స్ కేసు మరోసారి ఊపేస్తుంది. నిన్న ముంబైలోని మీరా రోడ్డులో ఉన్న ఓ పెద్దహోటల్‌ లో డ్రగ్స్‌ను ఎన్సీబీ అధికారులు పట్టుకున్నారు. అయితే ఈ కేసులో పట్టుబడిన తెలుగు హీరోయిన్ తప్పించుకుంది. డ్రగ్స్ సరఫరా చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ చాంద్ తో పాటు, టాలీవుడ్ హీరోయిన్ కూడా పట్టుబడింది. దాంతో మరోసారి డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చింది. దాంతో ఎన్సీబీకి చిక్కిన తెలుగు హీరోయిన్ ఎవరు అనేది ఆసక్తిగా మారింది.

మరోవైపు ముంబైలో దొరికిన టాలీవుడ్ హీరోయిన్ తప్పించుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు టాలీవుడ్ నటికి మాఫియా డాన్‌తో సంబంధాలున్నాట్టు ఎన్సీబీ అధికారులు గుర్తించారు. మాఫియా డాన్ కరీంలాలతో కలిసి నటి డ్రగ్ బిజినెస్ చేసినట్టు అనుమానిస్తున్నారు. కరీంలాల దేశం నుంచి వెళ్లకుండా లుక్‌ అవుట్ నోటీసులు జారీ చేశారు.

బాంద్రా, కుర్ల, అందేరిలో జరిపిన దాడుల్లో పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడింది. మీరా రోడ్డులోని హోటల్‌లో జరిపిన దాడుల్లో హీరోయిన్‌తో పాటు ఇద్దరు వ్యక్తులను ఎన్సీబీ అధికారులు పట్టుకున్నారు. 400 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories