
సూపర్ స్టార్ మహేశ్ బాబు, భూమిక చావ్లా హీరోహీరోయిన్లుగా గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఒక్కడు చిత్రం ఎంత పెద్ద సక్సెస్స్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ...
సూపర్ స్టార్ మహేశ్ బాబు, భూమిక చావ్లా హీరోహీరోయిన్లుగా గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఒక్కడు చిత్రం ఎంత పెద్ద సక్సెస్స్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా సూపర్ స్టార్ కెరీర్ లో ఒక మైల్ స్టోన్ అని చెప్పవచ్చు. దర్శకుడు గుణశేఖర్ వేయించిన భారీ సెట్టింగ్స్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఈ సినిమా నిర్మాత ఎం.ఎస్.రాజు బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీపడలేదు.
ఇప్పుడు ఒక్కడు చిత్రానికి సిక్వెల్ రాబోతుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇదే విషయం ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రాజు కూడా తన వ్యక్తిగత ట్విట్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. మహేశ్తో సినిమా విషయమై ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం ఆయన చెబుతూ.. త్వరలో మహేశ్తో ఓ సినిమా చేస్తానని ప్రకటించారు.
మహేశ్ బాబు అభిమానులు మరో అడుగుముందుకేసి 'కథ ఏంటి? డైరెక్టర్ ఎవరు? ఒక్కడు-2 తెరకెక్కిస్తున్నారా?' అంటూ వరుస ట్వీట్లు చేస్తున్నారు. ప్రస్తుతం తాను కథను రెడీ చేస్తున్నానని.. అన్నీ ఓకే అయ్యాక వచ్చే నెలలో ప్రాజెక్ట్కు సంబంధించిన వివరాలు వెల్లడిస్తానని రాజు చెప్పారు. అంతేకాకుండా ఒకవేళ 'ఒక్కడు-2' తెరకెక్కిస్తే గుణశేఖరే దర్శకత్వం వహిస్తారని ఆయన తెలిపారు. దీంతో 'ఒక్కడు-2' రానుందంటూ మహేశ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఎం.ఎస్ రాజు దాదాపు 8ఏళ్ల విరామం తర్వాత ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'డర్టీ హరి'. ఈ సినిమా ప్రమోషన్లో ఆయన బీజీ అయ్యారు. మరోవైపు త్వరలో మహేశ్బాబు 'సర్కారు వారి పాట' షూటింగ్ బీజీగా గడుపుతున్నారు. వీరి ప్రాజెక్టులు ముగిసిన తర్వాత ఒక్కడు 2 గురించి ఎనౌస్ చెస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.
Okkadu Lanti Cult Bomma Inkoti ivvandi sir @MSRajuOfficial Life long Runapadi untam ❤#SarkaruVaariPaata @urstrulyMahesh pic.twitter.com/Vu6lY79oC8
— Viking (@ronaldo_mb_dhf) January 1, 2021

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




