TG Vishwa Prasad: అందుకే ‘మిరాయ్‌’ టికెట్‌ ధరల్ని పెంచడం లేదు

TG Vishwa Prasad: అందుకే ‘మిరాయ్‌’ టికెట్‌ ధరల్ని పెంచడం లేదు
x
Highlights

TG Vishwa Prasad: "మిరాయ్" సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

TG Vishwa Prasad: "మిరాయ్" సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను ఎలాంటి లెక్కలు వేసుకోకుండా, ఒక లార్జర్‌ దేన్‌ లైఫ్‌ చిత్రంగా రూపొందించామని నిర్మాత టి.జి.విశ్వప్రసాద్ తెలిపారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై తన కుమార్తె కృతిప్రసాద్‌తో కలిసి ఆయన ఈ చిత్రాన్ని నిర్మించారు.

మంగళవారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో టి.జి.విశ్వప్రసాద్ మాట్లాడుతూ, "మిరాయ్" ఒక తల్లి సంకల్పంతో ముడిపడిన కథ అని తెలిపారు. ఆ సంకల్పం ఏమిటనేది తెరపై చూసి తెలుసుకోవాలని అన్నారు. సినిమా కథా ప్రపంచం, విజువల్స్, మరియు భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని ఆయన చెప్పారు. ఈ సినిమా చూస్తే రూ.300 కోట్లు ఖర్చు పెట్టి తీసిన అనుభూతి కలుగుతుందని, అందుకే టిక్కెట్‌ ధరల్ని పెంచడం లేదని వెల్లడించారు. ఈ సినిమాను ఇంట్లో చిన్న పిల్లల నుండి అందరూ చూడాలన్నదే తమ ధ్యేయమని విశ్వప్రసాద్ పేర్కొన్నారు.

తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. మంచు మనోజ్‌ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ఈ నెల 12న తెలుగుతో పాటు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories