చిరంజీవి ముగ్గురు డైరెక్టర్లు : వైర‌ల్ అవుతున్న సెల్ఫీ!

చిరంజీవి ముగ్గురు డైరెక్టర్లు : వైర‌ల్ అవుతున్న సెల్ఫీ!
x
Highlights

Chiranjeevi Directors : కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య అనే సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే...

Chiranjeevi Directors: కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య అనే సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే... అయితే ఈ సినిమా తర్వాత చిరంజీవి చేయబోయే ప్రాజెక్ట్ లపైన క్లారిటీ రావాల్సి ఉంది.. ఇప్పటికే కథలను విన్న చిరంజీవి డైరెక్టర్ లను కూడా సిద్దం చేశారు. అయితే ఏ సినిమాని ఏ డైరెక్టర్ తో చిరు చేయనున్నారు అన్నది ప్రేక్షకులలో సందేహం మొదలైంది. తాజగా ముగ్గురు దర్శకులు దిగిన సేల్ఫీ ఫోటో ఆ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేలా కనిపిస్తోంది.

నేడు వివి వినాయ‌క్ బ‌ర్త్ డే కావడంతో దర్షకులు మెహ‌ర్ ర‌మేశ్‌, బాబీలు వినాయక్ ఇంటికెళ్లి పుట్టిన‌రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. వినాయ‌క్ తో క‌లిసి ఈ ఇద్దరు డైరెక్టర్లు సెల్ఫీ దిగారు. అయితే ఈ ముగ్గురితో చిరంజీవి సినిమా ఉంటుంది అని ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే.. ఆచార్య సినిమా తర్వాత చిరు తమిళ చిత్రం వేదాల‌మ్ రీమేక్ ను మెహర్ రమేష్ తో చేయనున్నారు. ఆ తర్వాత లూసిఫ‌ర్ రీమేక్ ని వినాయక్ దర్శకత్వంలో చేయనున్నారని సమాచారం. ఇక డైరెక్టర్ బాబీతో ఓ స్ట్రెయిట్ ఫిలిం చేసేందుకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ ముగ్గురు డైరెక్టర్ల సెల్పీ చిరు సినిమాల పైన మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఇక ఆచార్య చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో చిరు సరసన కాజల్ అగర్వాల్ కథానాయకగా నటిస్తోంది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం వలన సినిమా వాయిదా పడింది. మెగస్టార్ పుట్టినరోజున సందర్భంగా రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది..ఇది చిరంజీవికి 152వ చిత్రం కావడం విశేషం.. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories