Chiranjeevi : ఆచార్య తర్వాత చిరు చేయబోయే సినిమా ఏది?

Chiranjeevi : ఆచార్య తర్వాత చిరు చేయబోయే సినిమా ఏది?
x

chiranjeevi 

Highlights

Chiranjeevi : గత ఏడాది సైరా చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం చిరు కొరటాల శివ దర్శకత్వంలో

Chiranjeevi : గత ఏడాది సైరా చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం చిరు కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే చిత్రం చేస్తున్నారు.. ఇది చిరంజీవికి 152వ చిత్రం కావడం విశేషం.. ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాజల్ కథానాయకగా నటిస్తోంది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం వలన సినిమా వాయిదా పడింది.

అయితే ఈ సినిమా తరవాత చిరు చేయబోయే సినిమా పైన ఎక్కడ లేని ఆసక్తి నెలకొంది. లాక్ డౌన్ సమయంలో ఆచార్య తరవాత చేయబోయే చిత్రాలకి సంబంధించిన కథలను వింటున్నట్టుగా చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే.. అందులో భాగంగానే మలయాళంలో భారీ హిట్ అయిన లూసిఫర్‌ రీమేక్ లో నటిస్తున్నట్టుగా చిరు స్పష్టం చేశారు. ఈ సినిమాకి సాహో ఫేం సుజీత్ దర్శకత్వం వహించనున్నాడని టాక్ వినిపించింది. అయితే సుజీత్ చేసిన మార్పులకి అంతగా ఇంప్రెస్ కానీ చిరు ఆ భాధ్యతలను వివి వినాయక్ చేతిలో పెట్టినట్టుగా సమాచారం..

ఇక ఇది ఇలా ఉంటే తమిళంలో హిట్ అయిన 'వేదాళం' సినిమాని కూడా చిరు రీమేక్ చేస్తున్నారు. ముందుగా ఈ సినిమాని పవన్ కళ్యాణ్ చేయాలనీ అనుకున్నారు. ప్రస్తుతం పవన్ వేరే సినిమాలతో బిజీగా ఉన్నారు. దీనితో వేదాళం సినిమాని చిరు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు. ఈ రీమేక్‌ బాధ్యతలను దర్శకుడు మెహర్‌ రమేశ్‌ కి అప్పగించినట్టుగా సమాచారం.. అంతేకాకుండా త్రివిక్రమ్ సినిమా కూడా లైన్లో లోకి వచ్చినట్టు తెలుస్తుంది. దీనిలో ఏది ముందు పట్టాలెక్కనుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే..

Show Full Article
Print Article
Next Story
More Stories